Home » బాలయ్య చిరుల కాంబోలో రావాల్సిన ఆ క్రేజీ మల్టీ స్టారర్ ఎందుకు ఆగిపోయిందో తెలుసా…!

బాలయ్య చిరుల కాంబోలో రావాల్సిన ఆ క్రేజీ మల్టీ స్టారర్ ఎందుకు ఆగిపోయిందో తెలుసా…!

by AJAY
Ad

ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్ లో నటిస్తే ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలు ఓకే సినిమా చేస్తే ఆ ఇద్దరు హీరోల అభిమానులు కూడా కలిసిపోయి పండగలా జరుపుకుంటారు. కాగా చిరంజీవి బాలకృష్ణ కాంబినేషన్ లో కూడా ఓ మల్టీస్టారర్ రావాల్సి ఉంది.

chiranjeevi-balayya

Advertisement

కానీ ముహూర్తం పూజాకార్యక్రమాలు పూర్తైన తర్వాత కొన్ని కారణాలవల్ల ఆ సినిమా ఆగిపోయింది. అసలు ఆ సినిమా ఏది..? ఎందుకు ఆగిపోయింది అనేది ఇప్పుడు చూద్దాం….. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శత్వంలో బాలయ్య, చిరంజీవితో ఓ మల్టీస్టారర్ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం అద్భుతమైన కథను కూడా సిద్ధం చేసుకున్నారు. ఆ సినిమానే “అపూర్వ సోదరులు”. ఈ సినిమాను చిరు బాలయ్య హీరోలుగా తెరకెక్కించాలని రాఘవేంద్ర రావు భావించారు.

Advertisement

అనంతరం వీరిద్దరికి కథను వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సినిమా ముహూర్తపు సన్నివేశానికి బాలయ్య, చిరంజీవి ఇద్దరూ ఒకే విధమైన డ్రెస్సులను వేసుకుని వచ్చారు. ఇక మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావల్సి ఉంది. అయితే ఇంతలో అనుకోకుండా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

అయితే చిరు ఎందుకు తప్పుకున్నారో మాత్రం చెప్పలేదు. కానీ బాలయ్య వెనకడుగు వేయకుండా తానే రెండు పాత్రల్లోనూ నటిస్తానని చెప్పారు. అలా అపూర్వ సోదరులు సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ చేశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. ఇక బాలయ్య ఒక్కడు చేస్తేనే సినిమా రిజల్ట్ ఇలా ఉంటే ఉంటే మెగాస్టార్ కూడా సినిమాలో భాగమైతే సినిమా మరో రేంజ్ లో ఉండేదని ఫ్యాన్స్ ఇప్పటికీ అనుకుంటారు.

Also read :

రాజీవ్ గాంధీ హత్యకు మురారి సినిమాకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా…!

పుష్ఫ సినిమాలో సీన్లు చూసి సుకుమార్ ను కొట్టావా..? క‌రాటే క‌ల్యాణిపై శ్రీరెడ్డి ఫైర్..!

Visitors Are Also Reading