Home » ఏ మాయ చేశావే మహేష్ ఎందుకు నో చెప్పాడో తెలుసా..?

ఏ మాయ చేశావే మహేష్ ఎందుకు నో చెప్పాడో తెలుసా..?

by Azhar
Ad
డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఏ మాయ చేశావే అనే సినిమాతో తెలుగు అభిమానులకు బాగా దగ్గర అయ్యారు అనేది నిజం. ఈ సినిమా ఆయనకు తెలుగులో మంచి గుర్తింపు అనేది తెచ్చింది. ఇక ఇందులో హీరోగా అక్కినేని నాగ చైతన్య నటించగా.. హీరోయిన్ గా సమంత నటించింది. ఇక ఈ ఏ మాయ చేశావే అనే సినిమా ఈ హీరో, హీరోయిన్ కూడా లైఫ్ ఇచ్చిన సినిమా అనే చెప్పాలి.
చైతన్యకు ఈ సినిమానే తన కెరియర్ లో మొదటి బ్లాక్ బస్టర్. అలాగే సమంత కెరియర్ కూడా ఈ సినిమా నుండి మారిపోయింది. కానీ ఈ ఏ మాయ చేశావే సినిమాను చైతన్య కోసం రాసుకోలేదట దర్శకుడు గౌతమ్ మీనన్. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించాడు. అయితే గౌతమ్ మీనన్ నుండి తాజాగా వస్తున్న ఓ సినిమా ప్రమోషన్స్ లో ఈ సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పారు.
గౌతమ్ మీనన్ మాట్లాడుతూ.. నేను ఈ ఏ మాయ చేశావే సినిమాను మహేష్ బాబు కోసమే రాసాను. కానీ నేను ఈ సినిమా కథతో ఆయన వద్దకు వెళ్లే సమయానికి మహేష్ బాబు పోకిరి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. దాంతో నేను ఈ ఏ మాయ చేశావే సినిమా చెప్పిన తర్వాత.. తాను మంచి మాస్, యాక్షన్ సినిమా చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి.. ఏ మాయ చేశావే కు నో చెప్పారు అని పేర్కొన్నారు. అయితే ఈ ఏ మాయ చేశావే సినిమా మంచి లవ్ స్టోరీ అనేది అందరికి తెలిసిందే.

Advertisement

Visitors Are Also Reading