Home » సావిత్రికి చివరి రోజుల్లో ANR, NTR ఎందుకు సాయం చేయలేదు?

సావిత్రికి చివరి రోజుల్లో ANR, NTR ఎందుకు సాయం చేయలేదు?

by Bunty
Ad

అలనాటి సావిత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగులో మహానటులు ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. సావిత్రి ఆటు తమిళనాట ఎంజీఆర్, శివాజీ గణేష్ లాంటి స్టార్ నటులతో కలిసి నటించి ఎంతో గొప్ప పేరు సంపాదించారు. తెలుగు చిత్ర పరిశ్రమ పుట్టినిల్లు అయితే తమిళ చిత్ర పరిశ్రమ మెట్టినిల్లు అని సావిత్రి అనేవారు. బాలీవుడ్ లో సైతం ఆమె చెరగని ముద్రవేసింది. అప్పట్లో సావిత్రి కాల్ షీట్స్ కోసం స్టార్ హీరోలు ఎదురు చూసేవారంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

Advertisement

సావిత్రి జీవితం ఎంత గొప్పగా వెలిగిపోయిందో చివరి రోజుల్లో అన్ని కష్టాలు అనుభవించారని ఇండస్ట్రీ టాక్. కానీ అందరూ అనుకున్నట్లు ఆమె చనిపోయే ముందు దుర్భరమైన జీవితం అనుభవించలేదని కుటుంబ సభ్యులు చెబుతారు. సావిత్రికి సంబంధించి ఎన్నో ఆస్తులు ఆమె కూతురు విజయ చాముండేశ్వరి, కొడుకు సతీష్ కుమార్ లకు దక్కింది. ఇక సావిత్రి చనిపోయే నాటికి ఆమెకు సినీ ఇండస్ట్రీ వైపు నుంచి ఎలాంటి సహాయం కాని, సానుభూతి కానీ లభించలేదని ఫిలిం వర్గాల్లో టాక్. దీనికి గల కారణం సావిత్రి మొండి వైఖరి అంటారు.

Advertisement

తెలుగు ఇండస్ట్రీలో దిగ్గజ నటుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ లు సావిత్రికి ఎన్నోసార్లు ఆమె వ్యసనాలు మానివేయాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సలహా ఇచ్చారట. కానీ ఆమె మాత్రం తన మొండి వైఖరితో వారి మాటలు వినకపోవడం వల్లనే చివరి రోజుల్లో పెద్దగా పట్టించుకోలేదని ఫిలిం వర్గాల్లో టాక్. ఎన్టీఆర్, ఏఎన్నార్ లు మాత్రమే కాదు, సహనటీమణులు కూడా సావిత్రికి తన వ్యసనాలు మానివేయాలని చెప్పి చూశారట. కానీ ఎవరి మాటలు వినకపోవడంతో చనిపోయే ముందు ఎవరు రాలేదని, కనీసం చూడలేదని అంటారు. అందుకే ఎన్టీఆర్, ఏఎన్నార్ లు కూడా సావిత్రి పట్టించుకోలేదట.

READ ALSO : ఈ 5 లక్షణాలుండే అబ్బాయిలను అమ్మాయిలుగా బాగా ఇష్టపడతారట..3వది చాలా ముఖ్యం

Visitors Are Also Reading