Home » టిల్లు సీక్వెల్లో నటించలేం బాబోయ్ అంటూ పారిపోతున్న స్టార్ హీరోయిన్లు..అసలు ట్విస్ట్ ఏంటంటే..?

టిల్లు సీక్వెల్లో నటించలేం బాబోయ్ అంటూ పారిపోతున్న స్టార్ హీరోయిన్లు..అసలు ట్విస్ట్ ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సూపర్ హిట్ అయింది అంటే దానికి సీక్వెల్ గా మరో సినిమా కోసం ఎదురు చూస్తుంటారు అభిమానులు. అంతేకాకుండా క్రేజీ క్యారెక్టర్ ఆర్టిస్టులు మరియు హీరోయిన్లు కూడా ఆ సీక్వెల్ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ డీజే టిల్లు సీక్వెల్లో మాత్రం చాలా డిఫరెంట్ గేమ్ నడుస్తోంది. హీరోయిన్స్ ఒక్కొక్కరిగా నేను నటించను బాబోయ్ అంటూ పారిపోతున్నారు.. డిజె టిల్లు సీక్వెల్ లో ఏముంది.. ఆ డైరెక్టర్,హీరోయిన్లు ఎందుకు పారిపోయారు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

Advertisement

also read;చిరంజీవి అంతటి స్థాయికి ఎదగాల్సిన హీరో ‘సుమన్’ సినీ జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తులు ఎవరు ?

సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేసిన మూవీ డీజే టిల్లు.. ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై ఊహించని విజయాన్ని అందుకుంది.. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ 50 కోట్ల క్లబ్ లో చేరిందంటే ఆశ్చర్య పోవాల్సిందే. ఇంతటి విజయాన్ని అందుకున్న ఈ సినిమా సీక్వెల్ గా డీజే టిల్లు 2 మొదలుపెట్టారు.. అలా మొదలైందో లేదో దర్శకుడు వెళ్లిపోయాడు.. ఆ తర్వాత హీరోయిన్ నేహా శెట్టి కూడా ఖతం. దీంతో కొత్త దర్శకుడిగా మల్లిక్ రాం వచ్చారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫైనల్ చేసుకున్నారు. తాజాగా ఆ హీరోయిన్ కూడా ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీని తర్వాత ప్రేమమ్ బ్యూటీ మడోనా సెబాస్టియన్ ని తీసుకున్నారు.

Advertisement

ఈ విధంగా మూవీ అండర్ ప్రొడక్షన్లో ఉన్న సమయంలో హీరోయిన్లు ఒక్కరి తర్వాత ఒకరు ప్రాజెక్టు నుండి తప్పుకోవడంతో చాలామంది నుంచి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయానికి వస్తే డిజె టిల్లు సినిమాలో హీరోయిన్ కి అంత ప్రాధాన్యత లేదని బయట టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఆర్ఎక్స్ 100 సినిమా తరహాలో హీరోయిన్ విలన్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. ఈ కారణంగానే ప్రాధాన్యత లేనటువంటి పాత్రలో నటించలేమంటూ హీరోయిన్స్ ఒకరి తర్వాత ఒకరు పారిపోతున్నారు. చివరకు ఇప్పుడు తీసుకున్న మడోనా సెబాస్టియన్ కూడా ఉంటుందో లేదో ముందు ముందు తెలుస్తుంది.

also read;ఒకే ప్రేమ్ లో కనిపించనున్న బాలయ్య, ప్రభాస్.. అభిమానులకు పండుగే..!

Visitors Are Also Reading