Home » ఇంటర్ పరీక్ష రాస్తుండగా విద్యార్థినికి పురిటి నొప్పులు..!

ఇంటర్ పరీక్ష రాస్తుండగా విద్యార్థినికి పురిటి నొప్పులు..!

by Anji
Ad

చదువు అంటే కొంత మందికి చాలా ఇష్టం. మరికొందరికీ మాత్రం అసలు ఇష్టం ఉండదు. ఏదో చదువుతున్నామా అంటే చదువుతున్నం అన్నట్టు ఉంటారు. కొంత మంది ఎంత కష్టం వచ్చినప్పటికీ ఏడాది మొత్తం ఇష్టంగా చదువుతుంటారు. ఆ తరువాత పరీక్షలలో తమ సత్తా ఏంటో చాటుతుంటారు. చదువు అంటే కేవలం విద్యార్థులు, విద్యార్థినిలే కాదు.. పెళ్లి అయిన వారు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. వివాహం జరిగి పిల్లలున్నవారు కూడా కొంత మంది పదోతరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షలు రాసి ఉత్తీర్ణులవుతున్నారు.  

Also Read :  ఐపీఎల్‌లో మళ్లీ కెప్టెన్‌గా ఛాన్స్‌ కొట్టేసిన డేవిడ్‌ వార్నర్‌

Advertisement

ఓ పని చేస్తూనే మరో పక్కా ఖాలీ సమయంలో చదువుకుంటూ పరీక్షలు రాస్తున్నార. కొంత మంది ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటారు. ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హత సంపదించడం కోసం ప్రైవేట్ గా ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరవుతుంటారు. ఇలా ఆడ, మగ అని తేడా లేకుండా చాలా మంది పరీక్షలు రాసి పాస్ అవుతుంటారు. ఈ తరహాలోనే ఓ యువతి ఇంటర్మీడియట్ పరీక్షల కోసం బాగా ప్రిపేర్ అయింది. పైగా ఆమె గర్భిణీ. గర్భిణి అయి ఉండీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడమే కాదు.. నిండు గర్భిణీ పరీక్షకు హాజరు అయింది. పరీక్ష రాయకుండానే పురిటి నొప్పులతో ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది.పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థినికి పురిటి నొప్పులు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది.

Advertisement

 Also Read :  మీరు అతిగా నిద్ర పోతున్నారా.. అయితే ఈ ప్రమాదంలో పడినట్టే ? Manam News

వివరాల్లోకి వెళ్లితే.. కొత్తవలసకి చెందిన ఓ వివాహిత (22) పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష రాసేందుకు హాజరైంది. ఆమె 9 నెలల గర్భిణీ కావడంతో పరీక్ష రాస్తుండగానే పురిటి నొప్పులు వచ్చాయి. విషయం తెలుసుకున్న కళాశాల ప్రిన్సిపాల్ 108 కి కాల్ చేసారు. సకాలంలో అంబులెన్స్ అక్కడికి చేరుకొని ఆ యువతిని పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆమె వెటర్నరీ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. ఇంటర్మీడియట్ అర్హత ఉండాలని చెప్పడంతో ఇంటర్ పరీక్షలు రాసేందుకు పరీక్ష కేంద్రానికి వెళ్లింది. పరీక్ష పూర్తవ్వకుండానే ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. ఈ పరీక్షలు తన భార్యకు ఎంతో ముఖ్యమని.. అందుకే నెలలు నిండినా తన భార్యను పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చినట్టు భర్త పేర్కొన్నాడు.  

Also Read :  ఈ ఫోటోలో ఉన్న తెలుగు హీరో ఎవరో గుర్తు పట్టారా..? అతనికి భార్య, కూతురు కూడా ఉన్నారు..!

Visitors Are Also Reading