తెలుగులో ప్రస్తుతం టాప్ యాంకర్లుగా కొనసాగుతున్న వారు ఏమేమి చదువుకున్నారు అంటే ఎవరైనా వారు ఏ పెద్ద చదువులు చదువుకున్నారో అని చెబుతుంటారు. కానీ చదువుకు యాంకరింగ్కు అసలు సంబంధం ఉండనే ఉండదు. చదువు అనేది ఎడ్యుకేషన్కు సంబంధించినది.. యాంకరింగ్ అనేది మీడియాకు సంబంధించినది అని పలువురు యాంకర్లు పేర్కొంటున్నారు.
Also Read: లలితా జ్యుయలరీస్ యజమాని రజినీకాంత్ సినిమాలో నటించారని తెలుసా..?
Advertisement
ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు వెండితెరపై హల్చల్ చేస్తున్న యాంకర్లు చాలా మంది ఉన్నారు. కొందరికీ సినిమా ఫాలోయింగ్ బాగానే ఉన్నది. సోషల్ మీడియాలో సైతం వారిపై ఫాలోయింగ్ ఉంది. సుమ, అనసూయ, రేష్మి లాంటి వారు యాంకరింగ్తో పాటు వెండితెరపై కూడా వారు ఇరుగదీస్తున్నారు. తొలుత కల్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది సుమ. ఆ తరువాత వెండి తెర నుంచి బుల్లితెరకు కూడా మారింది. ఇప్పటికే పలు సీరియల్స్ నటించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత పలు షోలకు యాంకరింగ్గా పని చేసింది. ఈమె ఎం.కామ్ వరకు చదివింది.
Advertisement
తెలుగులో సుమ తరువాత మరొక టాప్ యాంకర్ గా దూసుకుపోతుంది ఝాన్సి. ఈమె కూడా తొలుత సినిమా నటిగానే గుర్తింపు పొందింది. ఆ తరువాత బుల్లితెరపై కూడా సందడి చేయడం ప్రారంభించింది. ఝాన్సీ బీటెక్ చేసింది. అదేవిధంగా తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న యాంకర్లలో ఉదయభాను కూడా ఒకరు. ఈమె కూడ పలు సినిమాలలో నటించింది. ఆ తరువాత పలు టీవీషోలలో నటించింది. ఈమె ఎంటెక్ పూర్తి చేసింది. అదేవిధంగా తెలుగు మెయిల్ యాంకర్లలో నెంబర్వన్గా కొనసాగుతున్నాడు ప్రదీప్. ఇతను కూడా పలు సినిమాలలో నటిస్తున్నాడు. అయితే విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాల నుంచి బీటెక్ పూర్తి చేశాడు. జబర్దస్త్ షో ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించింది అనసూయ. పలు షోలకు యాంకరింగ్ చేయడం మొదలు పెట్టింది. పలు ఐటమ్ సాంగ్స్ చేసింది. ఎంబీఏ కంప్లీట్ చేసింది. అదేవిధంగా రష్మీ డిగ్రీ కంప్లీట్ చేసింది.
Also Read: డాడీ సినిమాలో నటించిన పాప ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..?