Home » ‘ఖుషి’ రీరిలీజ్ గురించి భూమిక ఏమన్నారంటే..?

‘ఖుషి’ రీరిలీజ్ గురించి భూమిక ఏమన్నారంటే..?

by Anji
Ad

పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. జనసేన పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఓ వైపు రాజకీయాల్లో రాణిస్తూనే.. మరోవైపు సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవలే భీమ్లానాయక్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ఇదిలా ఉండగా.. మరోవైపు పవన్ కళ్యాణ్ నటించినటువంటి సూపర్ హిట్ మూవీ ఖుషి రీరిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. 

Advertisement

ఎస్.జేసూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ ని షేక్ చేసిందనే చెప్పవచ్చు. పవన్ కి ఖుషి సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇందులో పవన్ నటన, యాటిట్యూడ్ కి ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయారు. హీరోయిన్ భూమిక అందంతో నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఖుషి సినిమాని డిసెంబర్ 31న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాను మరోమారు థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయడానికి ఫ్యాన్స్ అంతా సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం రీరిలీజ్ పై హీరోయిన్ భూమిక స్పందించింది. 

Advertisement

 

భూమిక ప్రస్తుతం విదేశాలలో ఉన్నారు. అక్కడి నుంచి ఆమె ఓ వీడియో ఈ సినిమా గురించి మాట్లాడారు. ఖుషి రీరిలీజ్ అవుతుండడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తనకు ఖుషి సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన నిర్మాత ఏ.ఎం. రత్నం, దర్శకుడు ఎస్.జే.సూర్య, హీరో పవన్ కళ్యాణ్ కి ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కొత్త సంవత్సరాన్ని సంతోషంగా గడపండి అంటూ వీడియోలో వెల్లడించారు. భూమిక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో నటిస్తున్నారు. అక్క, వదిన వంటి పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. గతంలో భూమిక హీరోయిన్ గా నటించిన ఒక్కడు సినిమా రీరిలీజ్ సమయంలో థియేటర్ కి వెళ్లి మరీ సినిమాను వీక్షించి ఎంజాయ్ చేశారు. 

Also Read :  అన్ స్టాపబుల్ షోకి పవన్ వేసుకున్న బ్లాక్ హుడీ ధర ఎంతో తెలుసా ?

Visitors Are Also Reading