Home » “వాల్తేరు వీరయ్య” సినిమా విలన్ బాబీ సింహా భార్య ఎవరో తెలుసా..? వీళ్ళ లవ్ స్టోరీలో అదిరిపోయే ట్విస్ట్ లు…!

“వాల్తేరు వీరయ్య” సినిమా విలన్ బాబీ సింహా భార్య ఎవరో తెలుసా..? వీళ్ళ లవ్ స్టోరీలో అదిరిపోయే ట్విస్ట్ లు…!

by AJAY
Published: Last Updated on
Ad

చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నటించగా ఆయనను ఢీకొట్టే పాత్రలో విలన్ గా బాబీసింహా నటించారు. బాబీసింహా తమిళ, మలయాళ చిత్రాల్లో నటుడిగా మంచి గుర్తింపు సాధించాడు. తమిళ్ లో వచ్చిన జిగర్తాండ సినిమాలో నటించి జాతీయస్థాయిలో ఉత్తమ నటుడుగా అవార్డును అందుకున్నాడు.

Also Read: బాలయ్య సినిమాకి ఓటీటీలో ముహూర్తం ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..?

Advertisement

అంతేకాకుండా విక్రమ్ స్వామి తమిళ్ అనే సినిమాలో విక్రమ్ ను ఢీకొట్టే పాత్రలో నటించాడు. ఈ సినిమాలో అద్భుతమైన విలనిజంతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో బాబీ సింహా ఫుల్ బిజీగా మారిపోయాడు. ఓవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు దర్శకుడిగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా కూడా రానిస్తున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా నటిస్తున్న బాబీసింహా ఒకప్పుడు షార్ట్ ఫిల్మ్స్ లో నటించాడు.

Advertisement

దాదాపు పదికి పైగా షార్ట్ ఫిల్మ్స్ లో నటించి తన నటన తో మెప్పించాడు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారానే సినిమా ఆఫర్ లను సైతం అందుకున్నాడు. 2012లో లవ్ ఫెయిల్యూర్ అనే సినిమా ద్వారా తమిళ ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత తమిళ్ లో దాదాపు 20 కి పైగా సినిమాల్లో నటించాడు. ఇక సినిమాలలో నటిస్తున్న సమయంలోనే 2016లో తోటి నటి రేష్మి మీనన్ ను బాబీసింహా ప్రేమ వివాహం చేసుకున్నాడు.

ఇదిలా ఉంటే బాబీసింహా తమిళ్ లో సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయన తెలుగువాడు అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఏపీలోని కృష్ణా జిల్లా మోపీదేవి గ్రామంలో బాబీసింహా జన్మించాడు. 8వ తరగతి వరకు మోపిదేవి స్థానిక పాఠశాలలోనే చదువుకున్నాడు. ఇక బాబీ సింహా కుటుంబం వ్యవసాయం చేయడం కోసం తమిళనాడుకు వలస వెళ్లగా అక్కడే స్థిరపడ్డారు.

Also read :వెంకటేష్ కూతురు హీరోయిన్ మాదిరిగా ఉంది.. ఆమెని ఎప్పుడైనా చూశారా?

Visitors Are Also Reading