టాలీవుడ్ నటుడు వీకే నరేష్ నటి పవిత్ర లోకేష్ ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నరేష్ పవిత్రల వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. గత కొద్దిరోజులుగా నరేష్ పవిత్రలు డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తునే ఉన్నాయి. కానీ న్యూయర్ సందర్భంగా తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు నరేష్ వీడియోను విడుదల చేయడంతో వారి పెళ్లి కన్ఫామ్ అయ్యింది.
Advertisement
ఇదిలా ఉంటే నరేష్ కు గతంలోనే మూడు పెళ్లిళ్లు అయ్యాడు. మూడో భార్య రమ్యా రఘుపతితో ఇంకా విడాకులు కూడా తీసుకోలేదు. అయితే రమ్యా రఘుపతి కంటే ముందు నరేష్ రేఖ సుప్రియను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ప్రముఖ రచయిత దేవులపల్లికృష్ణశాస్త్రి గారి మనవరాలే రేఖ సుప్రియ. అంతే కాకుండా బుజ్జాయి రచయిత అయిన సుబ్బరాయ శర్మ కూతురు కావడం విశేషం.
Advertisement
రేఖ సుప్రియ తండ్రి సుబ్బరాయ శర్మ విజయనిర్మలకు సన్నిహితులు కావడంతో నరేష్ తో సంభందం కుదిరింది. ఇక పెళ్లి తరవాత నరేష్ రేఖ సుప్రియలకు ఇద్దరు కుమారులు పుట్టారు. వారిలో పెద్ద కుమారుడు నవీన్ సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే చిన్న కుమారుడు తేజకు ఆటిజం ఉంది. ఆటిజం అంటే పిల్లలు శారీరకంగా పెద్దవాళ్లు అయినప్పటికీ మానసికంగా మాత్రం ఎదుగుదల ఉండదు.
ఆ కారణం వల్లనే నరేష్ తన భార్యకు విడాకులు ఇచ్చాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక విడాకుల తరవాత నవీన్ బాధ్యతలు నరేష్ చూసుకుంటున్నాడు. అంతే కాకుండా రేఖ సుప్రియ తేజ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇక రేఖ సుప్రియ తేజ లాంటి కొంతమంది పిల్లలను దత్తత తీసుకుని వారి పూర్తి ఖర్చులు భరిస్తున్నారు. అంతే కాకుండా ఓ ట్రస్ట్ ను ప్రారంభించి ఆటిజం తో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రలకు కోచింగ్ కూడా ఇస్తున్నారు.
ALSO READ : సాయం చేయమని వేడుకుంటున్న మహేష్ బాబు డూప్ శీను..కారణం..!