Home » విరాటపర్వం ట్రైలర్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

విరాటపర్వం ట్రైలర్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

by Anji
Ad

దగ్గుబాటి రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం విరాట పర్వం. ఈ సినిమాకు వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూసిన దగ్గుబాటి అభిమానులు.. విరాట పర్వం ట్రైలర్ చూసి ఫిదా అవుతున్నారు. చిత్రంలో రానా కామ్రేడ్ రవన్నగా, సాయి పల్లవి వెన్నెలగా కనిపించారు.

Advertisement

ముఖ్యంగా చిన్న ఎవడు..? పెద్ద ఎవడు..? రాజ్యమేలే రాజు ఎవడు..? సామ్యవాద పాలననే స్థాపించగా ఎదిగిన వాళ్లు అని రా నా మాటలు వినిపించడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. రవన్న రాసే పుస్తకాలను చదివి అతనికి తెలియకుండానే ప్రేమలో పడుతుంది సాయి పల్లవి. ఇక పుస్తకం రాసిన వాడు చూడాలంటూ అమ్మవారి దగ్గర మొర పెట్టుకుంటుంది వెన్నెల. ఆమె అలా అడిగిందో లేదో వెంటనే రవన్న ఊర్లో దిగుతుంది. రాణా లో చూసి సాయి పల్లవి మురిసిపోతుంది. ప్రేమ కోసం ప్రేమించిన వ్యక్తిని పొందడం కోసం తాను కూడా నక్సలైట్ గా మారుతుంది. కానీ ప్రజాసేవలో ఉన్న రవన్న ప్రేమంటే పడనట్టే కనిపిస్తాడు. అతను వెన్నెల ప్రేమను అర్థం చేసుకుంటాడా..? వీరి ప్రేమ ఏ తీరాన్ని చేరింది అనేది కరంగా మారింది.

Advertisement

నీ రాతల్లో నేను లేకపోవచ్చు కానీ..నీ తలరాతలో మాత్రం ఖచ్చితంగా నేనే ఉన్నా. ఓ యుద్ధం ఎన్నో ప్రాణాలను తీస్తుంది. అదే యుద్ధం నాకు ప్రాణం పోసిన డైలాగ్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. నక్సలైట్ల వలన ఏమైనా ఉపయోగం ఉందా అని పోలీసులు ప్రశ్నించగా.. మా ఊరిలో ఆడోళ్ళ పై ఘోరాలు జరిగినప్పుడు ఏ పార్టీ రాలేదు.. మా అన్నలు వచ్చారు అని నక్సలైట్ గొప్పతనం గురించి రాహుల్ రామకృష్ణ వివరించారు. డి.సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. నవీన్ చంద్ర సీనియర్ ఉద్యమకారుడు రఘు అన్నగా.. ప్రియమణి కామ్రేడ్ భారతక్కగా కనిపిస్తారు. ఈ చిత్రము జూన్ 17న విడుదల అవ్వనుంది. తొలుత ఈ సినిమా జులై 1న ప్రపంచవ్యాప్తంగా త్వరలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించి.. ఇక తరువాత చిత్రాన్ని జూన్ 17న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

Also Read : 

తమన్నాకు అనిల్ రావిపూడికి మధ్య వివాదం.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..?

ఆది పినిశెట్టి కట్నం ఎంత తీసుకున్నాడో తెలుసా…?

 

Visitors Are Also Reading