Home » బాబర్ మెసేజ్ పై స్పందించిన విరాట్ కోహ్లీ..!

బాబర్ మెసేజ్ పై స్పందించిన విరాట్ కోహ్లీ..!

by Azhar
Ad

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఎక్కడ చూసిన విరాట్ కోహ్లీ గురించే మాట్లాడుతున్నారు. అసలు ఈ విషయంలో సంబంధం లేని ఆటగాళ్లను కూడా కోహ్లీ ఫామ్ గురించే ప్రశ్నిస్తున్నారు. అయితే క్రికెట్ ప్రపంచంలో పరుగుల వరద అనేది పారించిన విరాట్ కోహ్లీ.. గత మూడేళ్ళుగా తన లయను కోల్పోయాడు. ఒక ఏడాది ఎలాగో అలాగా అర్ధ శతకాలతో రాణించిన కూడా.. ఈ మధ్య దారుణంగా విఫలమవుతున్నాడు. దాంతో కొందరు కోహ్లీని జట్టు నుండి తీసేయాలి అని అంటుంటే.. మరికిందరు కోహ్లీకి మద్దతుగా నిలిస్తున్నారు.

Advertisement

ఇక కోహ్లీని సపోస్ట్ చేసిన వారిలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం కూడా ఉన్నాడు. ప్రస్తుతం విరాట్ ఇంగ్లాండ్ పర్యటనలో టీం ఇండియాతో కలిసి ఉన్నాడు. అక్కడ రెండో వన్డే ఆడిన కోహ్లీ 16 పరుగులే చేసి పెవిలియన్ చేరుకున్నాడు. ఆ క్రమంలో అందరూ కోహ్లీని విమర్శిస్తుంటే.. బాబర్ మాత్రం ట్విట్టర్ వేదికగా కోహ్లీతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ… ఈ కష్ట కాలం అనేది పోతుంది. స్ట్రాంగ్ గా ఉండు. అంటూ కోహ్లీ పేరును జత చేసాడు. ఇక బాబర్ నుండు ఇలా ఎవరు ఉంచని ట్విట్ అనేది రావడంతో.. కోహ్లీ ఫ్యాన్స్ అయితే ఖుషి అవుతున్నారు.

Advertisement

అయితే ఇప్పుడు ఆ అభిమానుల ఖుషిని మరింత పెంచేలా.. బాబర్ చేసిన ట్విట్ కు విరాట్ కోహ్లీ రిప్లయ్ ఇచ్చాడు. ధన్యవాదాలు. నువ్వు ఇలానే బాగా ఆడుతూ… ఇంకా ఎత్తుకు ఎదుగాలి అని నేను కోరుకుంటున్నాను. విష్ యు ఆల్ ద బెస్ట్ అని పోస్ట్ చేసాడు. ఇక కోహ్లీకి మధాతుయా నిలిచి భారత అభిమానుల ప్రశంసలు బాబర్ అందుకోగా.. ఇప్పుడు ఆ ట్విట్ పైన స్పందించి పాకిస్థాన్ అభిమానుల ప్రేమను విరాట్ కోహ్లీ పొందుతున్నాడు. అయితే కోహ్లీ రెండు ఇంగ్లాండ్ తో జరగబోయే ఆఖరి వన్డేలో ఏం చేస్తాడు అని చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ పొడిగింపుకు ఒప్పుకున్న ఐసీసీ..!

విరాట్ కు ఎందుకు సపోర్ట్ చేసాడో చెప్పిన బాబర్..!

Visitors Are Also Reading