Home » వరల్డ్ కప్ లో వచ్చే పైసల్ కంటే కోహ్లీ పోస్టులకే ఎక్కువ..!

వరల్డ్ కప్ లో వచ్చే పైసల్ కంటే కోహ్లీ పోస్టులకే ఎక్కువ..!

by Azhar
Ad

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం స్టార్ క్రికెటర్ గా పేరు అనేది సంపాదించుకున్నాడు విరాట్ కోహ్లీ. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల్లో అతనికి అభిమానులు ఉన్నారు. అది అతని ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ను చూస్తేనే అర్ధం అవుతుంది. ప్రస్తుతం కోహ్లీకి 216 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. దీనిని బట్టే అర్ధం చేసుకోవచ్చు.. కోహ్లీ ఒక్క ఫ్యాన్ ఫాలోయింగ్.

Advertisement

అయితే ప్రస్తుతం విరాట్ కోస్లీ టీం ఇండియాతో కలిసి.. ఈ నెలలో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళాడు. అయితే ఈ ప్రపంచ కప్ లో గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీని తాజాగా ఐసీసీ ప్రకటించింది. ఇందులో టైటిల్ అందుకున్న జట్టుకు 1.6 మిలియన్ డాలర్స్ అంటే 13 కోట్ల రూపాయలు అందుతాయి. కానీ ఈ ప్రైజ్ మనీ అనేది కోహ్లీ యొక్క పోస్టుల కంటే తక్కువ అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Advertisement

విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ చేయడానికి 9 కోట్లు వసూల్ చేస్తున్నాడు. ఈ లెక్కన.. కోహ్లీ రెండు పోస్టులు వేస్తే ప్రపంచ కప్ లో వచ్చే ప్రైజ్ మనీ కంటే ఎక్కువ వస్తుంది అంటూ.. మిమ్స్ చేసి వీర చేస్తున్నారు కొంతమంది ఫ్యాన్స్. కానీ మరికొందరు.. ఈ ప్రపంచ కప్ గెలిస్తే వచ్చే టైటిల్ తో పాటుగా పేరు అనేది కోగలి సంపాదన వల్ల దేశానికి రాదు అని కూడా కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ పరువు తీసేసిన అశ్విన్..!

రోనాల్డోను మెచ్చుకున్న యువీ పరువు తీస్తున్న ఫ్యాన్స్..!

Visitors Are Also Reading