Home » కోహ్లీపై దారుణమైన ట్రోలింగ్…

కోహ్లీపై దారుణమైన ట్రోలింగ్…

by Azhar
Ad
ఐపీఎల్ 2022 లో కోహ్లీకి ఏది కలిసి రావడం లేదు. వరుస వైఫల్యాలతో అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. దాంతో అతని పై అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే ఈరోజు బెంగళూర్ జట్టుకు ఎంతో కీలకమైన మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆడుతుంది. ఈ మ్యాచ్ లో కోహ్లీ గోల్డెన్ డక్ ఔట్ అయ్యాడు. యువ స్పిన్నర్ జగదీష సుచిత్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ మొదటి బంతికే కోహ్లీ ఔట్ అయ్యాడు.
అయితే ఈ సీజన్ లో స్పిన్ కు ఇబ్బంది పడుతున్న కోహ్లీకి బౌలింగ్ కోసం హైదరాబాద్ కెప్టెన్ కేన్ మామ మొదటి ఓవర్ స్పిన్నర్ కు ఇచ్చాడు. అయిన కోహ్లీ పరిస్థితి అర్ధం చేసుకోకుండా.. విలియమ్సన్ కు సింపుల్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయితే కోహ్లీ ఔట్ అయిన విధానం ఇప్పుడు అభిమనులకు ఆగ్రహం తెప్పిస్తుంది.
దాంతో కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించి ఇంట్లోనే ఉంది ఆ ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లో పోస్టులు పెట్టుకుంటూ ఉండాలని సూచిస్తున్నారు. ఇంకొందరు కోహ్లీని రెచ్చగోటండి… అప్పుడే అతనిలోని పాత విరాట్ బయటకి వస్తాడు అని అంటున్నారు. అయితే ఐపీఎల్ ప్రారంభ సీజన్ 2008 నుండి 2021 వరకు కేవలం మూడుసార్లు గోల్డెన్ డక్ అయిన కోహ్లీ ఈ ఒక్క ఐపీఎల్ 2022 లోనే మూడుసార్లు గోల్డెన్ గుడ్డు పెట్టాడు.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading