Home » కోహ్లీ పై పెరుగుతున్న ఆరోపణలు.. ఫేక్ ఫీల్డింగ్ అంటూ..?

కోహ్లీ పై పెరుగుతున్న ఆరోపణలు.. ఫేక్ ఫీల్డింగ్ అంటూ..?

by Azhar
Ad

నిన్న ప్రపంచ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా విజయం అనేది అందుకుంది. కానీ ఇండియా ఈ మ్యాచ్ లో గెలిచినా తర్వాత నుండి పాక్ అలాగే బంగ్లా ఫ్యాన్స్ ఇండియా చీటింగ్ చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అటువంటి వారికీ బంగ్లా వికెట్ కీపర్ నూరుల్ హాసన్ ఓ బ్రహ్మాస్త్రం అనేది ఇచ్చాడు.

Advertisement

నిన్న మ్యాచ్ తర్వాత నూరుల్ మాట్లాడుతూ.. మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేసాడు. ఐసీసీ రూల్స్ ప్రకారం ఇది తప్పు. దీనికి మాకు 5 పరుగులు అనేవి లభించాలి అని పేర్కొన్నాడు. అంతే అప్పటి నుండి కోహ్లీ పై ఆరోపణలు అనేవి చేస్తూ.. కోహ్లీ ట్రోల్ చేస్తన్నారు. అయితే ఈ మ్యాచ్ మధ్యలో బ్యాటర్ కొట్టిన బంతిని బౌండరీ ముందు అర్షదీప్ సింగ్ అందుకొని.. నేరుగా బౌలర్ కు త్రో చేసాడు.

Advertisement

కానీ మధ్యలో ఉన్న విరాట్ కోహ్లీ.. తాను బాల్ అందుకొని త్రో చేస్తున్న విధంగా చేసాడు. అయితే ఇలా చేయడం అనేది ఐసీసీ రూల్స్ కు విరుద్ధం. ఈ విషయాన్ని అక్కడే మ్యాచ్ లో బంగ్లా అంపైర్ తో మాట్లాడితే పెనాల్టీ రూపంలో ఆ జట్టుకు 5 పరుగులు వచ్చేవి. కానీ వారు అలా చేయలేదు. అయితే బంగ్లా ఓడిపోయింది కూడా 5 రన్స్ తేడాతోనే కావడంతో.. పాక్ ఫ్యాన్స్ ఇండియాను ట్రోలింగ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

మహిళల ఐపీఎల్ లోకి ఆర్సీబీ ఎంట్రీ..?

పెద్ద షాక్.. కోహ్లీని పొగిడిన గంభీర్..!

Visitors Are Also Reading