Home » నేను ఇంకా జట్టులో ఉండటానికి కారణం అతనే..!

నేను ఇంకా జట్టులో ఉండటానికి కారణం అతనే..!

by Azhar
Ad

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు అనేది తెలిసిందే. ఆడిన 5 మ్యాచ్ లలో మూడు హాఫ్ సెంచరీలు అనేవి చేసి.. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. దాంతో అందరూ విరాట్ పై ప్రశంసలు అనేవి కురిపిస్తున్నారు. కానీ ఈ ఏడాది ఆరంభంలో కోహ్లీ పరిస్థితి ఎలా ఉందొ అందరికి తెలుసు.

Advertisement

గత ఏడాది ముగిసిన ప్రపంచ కప్ నుండి విరాట్ కోహ్లీ పరుగులు చేయలేక తంటాలు పడ్డాడు. వరుస వైఫల్యాలతో.. కోహ్లీ ఎన్నో విమర్శలు అనేవి ఎదురుకున్నాడు. ఆ సమయంలోనే కోహ్లీకి ఇక జట్టులో చోటు అనేది ఉండదు అని వార్తలు వచ్చాయి. సెప్టెంబర్ లో జరిగిన ఆసియా కప్ లో కోహ్లీ ఫెయిల్ అయితే జట్టు నుండి బయటికే అన్నారు. కానీ ఆ టోర్నీలో కోహ్లీ సూపర్ సక్సెస్ అయ్యాడు.

Advertisement

అయితే తాను విమర్శలు ఎదుర్కుంటున్న సమయంలో.. జట్టులో చోటు ఉండదు అని అంటున్న సమయంలో తనకు మద్దతుగా నిలిచింది కేవలం మహేంద్ర సింగ్ ధోని మాత్రమే అని విరాట్ తాజాగా వెల్లడించాడు. ఆ సమయంలో ధోని ఒక్కడే నాకు మెసేజ్ చేసాడు. మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ అనేది ఫ్రెండ్‌షిప్ కంటే ఎక్కువ అని విరాట్ చెబుతున్న వీడియోను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ట్విటర్ లో పోస్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి :

రాహుల్ వల్ల ఇండియా పేరిట చెత్త రికార్డులు..!

సీన్ రివర్స్.. ఫ్యాన్స్ ను ట్రోల్ చేసిన షాహిన్..!

Visitors Are Also Reading