Home » వైరల్ వీడియో… ఏకంగా రైలు పట్టాల మీద వీడియోకు పోజిచ్చాడు… ఆ తరువాత?

వైరల్ వీడియో… ఏకంగా రైలు పట్టాల మీద వీడియోకు పోజిచ్చాడు… ఆ తరువాత?

by aravind poju
Ad

ప్రస్తుతం సోషల్ మీడియా హవా ప్రస్తుతం ప్రపంచమంతా నడుస్తుందన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుత యువత మొత్తం సోషల్ మీడియాలో మునిగి తేలుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఇక టెక్నాలజీ మోజులో పడి ఎంతో మంది తమ విలువైన ప్రాణాలను పోగొట్టుకున్న ఘటనలు మనం ఎన్నో చూశాం. అయితే సోషల్ మీడియాలో లైక్ ల కోసమో, షేర్ ల కోసమో వ్యూస్ కోసమో చాలా డేంజరస్ రిస్క్ లను చేస్తూ తమ కుటుంబాలకు శోకాన్ని మిగుల్చుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటివి ఘటనలు మనం సోషల్ మీడియాలో చాలా వరకు చూస్తూ ఉంటాం.

                                                                                     

Advertisement

Advertisement

అయితే ఇటువంటి వీడియోలు నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఓ యువకుడు ఏకంగా ట్రైన్ కు ఎదురుగా నిల్చొని వీడియోకు ఫోజిచ్చి విగతజీవిగా మారిపోయిన పరిస్థితి ఉంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఇటార్సీ-నాగ్​పుర్​ మార్గంలో యువకుడు పట్టాలపై ట్రైన్ వస్తుండగా వీడియో తీయమని తన స్నేహితుడికి తెలిపాడు. అయితే సదరు యువకుడు ట్రైన్ వేగాన్నిసరిగ్గా అంచనా వేయలేకపోవడంతో ట్రైన్ చాలా వేగంగా దూసుకరావడంతో తలకు బలమైన గాయం తగిలింది. అయితే హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఏ మాత్రం ఫలితం లేకపోయింది.

 

దారిలోనే సదరు యువకుడు మరణించారు. సరదాగా చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేద్దాం అనుకున్న యువకుడు ఇక ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఈ యువకుడు చేసిన పనికి నెటిజన్లు తిట్టి పోస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మిగతా వారికి ఒక చిన్న వార్నింగ్ లాగా అనిపిస్తుందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారిన ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా. ఇంకెందుకు ఆలస్యం. ఈ వైరల్ వీడియోపై ఓ లుక్కేయండి మరి.

 

watch video: 

Visitors Are Also Reading