Home » “విక్రమ్” ఓటీటీ హక్కులను దక్కించుకున్న “డిస్నీ”.. ఇక ఆరోజు నుంచి ఫాన్స్ కు పండగే ..?

“విక్రమ్” ఓటీటీ హక్కులను దక్కించుకున్న “డిస్నీ”.. ఇక ఆరోజు నుంచి ఫాన్స్ కు పండగే ..?

by Sravanthi Pandrala Pandrala
Ad

విలక్షణ నటుడు కమలహాసన్ సినిమా థియేటర్ లోకి వచ్చింది అంటే దేశవ్యాప్తంగా ఎంతో మంది ఫ్యాన్స్ కి పండగే పండగ.. కమల్ హాసన్ నటనా చాతుర్యం ఉన్న హీరో ఆయన.. తాజాగా థియేటర్లోకి వచ్చిన విక్రమ్ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ ఏడాది ఈ విధంగా ఎన్నో సినిమాలు ఫ్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయి సెన్సేషనల్ హిట్ కొట్టాయి. ఇందులో విక్రమ్ మూవీ కూడా చేరిపోయింది. మార్చి లో విడుదలైన టువంటి RRR మూవీ ఇండియాలోనే బాక్సాఫీస్ ను షేక్ చేసి ఎన్టీఆర్,రామ్ చరణ్, రాజమౌళి లకు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిందని చెప్పవచ్చు.

Advertisement

ఈ సినిమా పదకొండు వందల కోట్లకు పైగా ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్ అందుకుంది. దీని తర్వాత కే.జి.ఎఫ్ 2 సినిమా మరొకటి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ గా నిలిచింది. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత అతిపెద్ద విజయాన్ని అందుకొని దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ కు మంచి పేరు తీసుకువచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్ల వరల్డ్ గ్రాస్ అందుకుంది.. ఈ రెండు సినిమాల తర్వాత విడుదలైన సినిమా విక్రమ్. ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని భాషల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు చేపట్టింది.

Advertisement

దర్శకుడు లోకేష్ కనకరాజు స్క్రీన్ ప్లే యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో కమల్ హాసన్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. విజయ్ సేతుపతి విలన్ పాత్ర సినిమాను తారా స్థాయికి చేర్చిందని చెప్పవచ్చు. ఇక ఫైనల్ గా సూర్య ఎంట్రీ అభిమానులను మరింత ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటిటి విడుదలకు సిద్ధంగా ఉంది.. ఈ మూవీ ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నది. జూలై 8 వ తేదీన విక్రమ్ మూవీ ఓటీటీ లోకి రానున్నది.. దీంతో కమల్ హాసన్ అభిమానులు ఈ సినిమాను మరోసారి చూసి ఎంజాయ్ చేయనున్నారు.

ALSO READ;

Visitors Are Also Reading