Home » రాజ్యసభ కు విజయేంద్ర ప్రసాద్ ..ప్రధాని ఆసక్తికర ట్వీట్….!

రాజ్యసభ కు విజయేంద్ర ప్రసాద్ ..ప్రధాని ఆసక్తికర ట్వీట్….!

by AJAY
Ad

టాలీవుడ్ ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను రాజ్యసభకు నామినేట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. నేడు ట్విట్టర్ ద్వారా ప్రధాని ఈ విషయాన్ని ప్రకటించారు. ఇదిలా ఉండగా విజయేంద్ర ప్రసాద్ బాహుబలి సినిమా తో ఇండియా లోనే టాక్ కథా రచయిత గా గుర్తింపు తెచ్చుకున్నారు.

Advertisement

Advertisement

బాహుబలి కంటే ముందు రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన అన్ని సినిమాలకు కూడా కథను ఆయనే అందించారు. అంతే కాకుండా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన బజరంగీ బాయ్ జాన్ సినిమా కు కూడా విజయేంద్రప్రసాద్ కథను అందించారు. ఈ సినిమా లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించగా రికార్డులు క్రియేట్ చేసింది.

దాంతో బాలీవుడ్ నిర్మాతలు సైతం కథను అందించాలని విజయేంద్ర ప్రసాద్ ను కోరుతున్నారు. ఇక ఎన్నో మంచి కథలను రాసి భారత దేశ గౌరవాన్ని పెంచుతున్న నేపథ్యం లోనే విజయేంద్ర ప్రసాద్ కు ఈ అవకాశాన్ని ఇస్తున్నట్టు కూడా ప్రధాని ప్రకటించారు.

Visitors Are Also Reading