Home » సరిలేరు నీకెవ్వరులో విజయశాంతి నటించడానికి రీజన్ ఇదే!

సరిలేరు నీకెవ్వరులో విజయశాంతి నటించడానికి రీజన్ ఇదే!

by Azhar
Ad

సినిమాల్లో హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా యాక్షన్ సీక్వెన్స్ లు చేసే విజయశాంతి సడెన్ గా సినిమాలు చేయడం మానేశారు. దాంతో ఆమె అభిమానులు చాలా నిరాశకు లోనయ్యారు. దాదాపు 20 ఏళ్ళ తర్వాత 2020 లో మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి ఓ ఆర్మీ ఆఫీసర్ తల్లిగా కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా సాధించిన భారీ విజయానికి ఆవిడ కూడా ఓ కారణమే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఆవిడ వెల్లడించారు.

Advertisement

Advertisement

నేను 1998 లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాను. అప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా సినిమాలకు దూరం అయ్యాను. ఆ తర్వాత కూడా నాకు చాలా అవకాశాలు వచ్చాయి. ఆ పాత్రలు నచ్చక చెయ్యలేదు. కానీ సరిలేరు నీకెవ్వరు కథ కాను బాగా నచ్చింది. ఈ ఆర్మీ బ్యాక్ డ్రాప్ కావడమే కాకుండా.. ఆ పాత్ర కూడా చాలా డిగ్నిఫైడ్ గా ఉండటంతో.. నా భార్యను ఒప్పించి ఆ సినిమాలో నటించాను అని చెప్పారు.

ఈ సినిమాలో మహేష్ హీరో కావడంతో నాకు కొంచెం కంఫర్ట్ గా అనిపించింది. మహేష్, దర్శకుడు అనిల్ నన్ను బాగా చూసుకున్నారు. అయితే నిన్ను సినిమాలు చేసే రోజుల్లో బ్రేక్ వస్తే… హాయిగా చెట్ల కింద కుర్చునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎవరి క్యారవాన్ లోకి వారు వెళ్తున్నారు. ఆ క్యారవాన్ లోకి వేతేనే ఏదో గుహలోకి వెళ్లిన ఫీలింగ్ నాకు వస్తున్నది రాములమ్మ తెలిపారు.

Visitors Are Also Reading