Home » నోరు అదుపులో పెట్టుకో…సాయి పల్లవి పై రాములమ్మ ఫైర్…!

నోరు అదుపులో పెట్టుకో…సాయి పల్లవి పై రాములమ్మ ఫైర్…!

by AJAY
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి రీసెంట్ గా విరాటపర్వం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. కమ్యూనిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా పూర్తి ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి చేసిన కొన్ని కామెంట్లు దుమారం రేపాయి.

Advertisement

కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి సాయి పల్లవిని యాంకర్ ప్రశ్నించగా కశ్మీర్ లో పండిట్ లపై జరిగింది దారుణమని అలా చంపడం తప్పు అని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా కొందరు ఆవులను తరలిస్తున్నారని మనుషులను పట్టుకుని చంపారని అది కూడా తప్పు అంటూ వ్యాఖ్యానించింది. దాంతో సాయి పల్లవి వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నాయకులు ఫైర్ అవుతున్నారు.

Advertisement

తాజాగా బిజెపి నాయకురాలు నటి విజయశాంతి స్పందించారు. సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం గా ఉన్నాయని అన్నారు. ఆవులను చంపటం కాశ్మీర్ పండిట్ లను హత్య చేయడం రెండు ఒకటే ఎలా అవుతాయని ప్రశ్నించారు. దొంగను కొట్టడం…. తల్లి కుమారున్ని మందలించడం రెండు ఒకేలా ఎలా అవుతాయని సాయి పల్లవి ని ప్రశ్నించారు.

SAIPALLAVI

సాయి పల్లవి కి అసలు సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏం జరుగుతుంది అనే విషయాలపై అవగాహన లేదని…. అలాంటప్పుడు ఏది పడితే అది మాట్లాడకూడదని అన్నారు. సాయి పల్లవి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సెలబ్రిటీ గా చలామణి అవుతున్నవాళ్ళు సున్నితమైన అంశాలపై స్పందించేటప్పుడు ముందు వెనకా చూసుకోవాలని విజయశాంతి హితవు పలికారు. విరాట పర్వం సినిమాకు ప్రచారం కల్పించేందుకే ఆమెతో ఇలా మాట్లాడించారని విజయశాంతి ఆరోపించారు.

Visitors Are Also Reading