Home » బీస్ట్‌ సినిమాపై ఫ్యాన్స్‌ షాకింగ్‌ రియాక్షన్‌.. ఏకంగా స్క్రీన్‌ కు నిప్పుపెట్టి..!

బీస్ట్‌ సినిమాపై ఫ్యాన్స్‌ షాకింగ్‌ రియాక్షన్‌.. ఏకంగా స్క్రీన్‌ కు నిప్పుపెట్టి..!

by Azhar
Ad

సినీ ఇండస్ట్రీలో ఒక్క అక్షయ కుమార్ అభిమానులు మినహా.. మిగిలిన అందరి అభిమానులు తమ హీరో సినిమా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తారు. మామూలుగానే ఏడాదికి ఒక్క సినిమా చేసే హీరోలు.. ఈ కరోనా కారణంగా అది కాస్త మూడేళ్ళయింది. కాబట్టి ఇంత గ్యాప్ తర్వాత వచ్చే తమ హీరో సినిమాపై అభిమానులకు ఎన్నో ఆశలు ఉంటాయి. ఒకవేళ వారి ఆశలకు విరుద్ధంగా ఆ సినిమా ఉంటె… మాములుగా హీరోను.. లేదా డైరెక్టర్ ను తిడుతూ థియేటర్ నుండి బయటకు వస్తారు. కానీ ఈ హీరో అభిమానులు చేసిన పని.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్‌, పూజా హెగ్దే జంటగా నటించిన బీస్ట్‌ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. అయితే మొదటి షో తరువాత పర్వాలేదు అనిపించుకున్న.. ఈ సినిమా ఆ తర్వాతా నుండే డిజాస్టర్ టాక్ వైపుగా నడుస్తుంది. విజయ్‌- నెల్సన్‌ కాంబోలో వస్తున్న ఈ సినిమా పై దళపతి అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. కానీ అవి తారుమారు కావడంతో… వారు చేసిన పని చర్చముషానియంగా మారింది.

Advertisement

తమిళనాడులోని ఓ థియేటర్లో బీస్ట్‌ సినిమా చూస్తున్న అభిమానులు.. అది నచ్చలేదని ఏకంగా ఏకంగా సినిమా తెరకే నిప్పు పెట్టేసారు. ఈ ఘటనను అక్కడివారు వీడియోలు తీసి.. సోసిల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కడ్తా వైరల్ గా మారింది. సినిమా నచ్చకపోతే పోస్టర్లు చింపిన ఫ్యాన్స్ ను చూసాము కానీ.. ఇలా స్క్రీన్ కు నిప్పు పెట్టె ఫ్యాన్స్ ను ఇప్పుడే చూస్తున్నాం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

మంచి ఫామ్ లో ఉండగా రిటైర్మెంట్ తీసుకున్న 5 క్రికెటర్లు వీరే..!

అన్నం తిన్న తర్వాత ఈ పనులు చేస్తున్నారా.. దరిద్రానికి స్వాగతం చెప్పినట్టే..!

Visitors Are Also Reading