Home » మాల్దీవుల‌కు ప‌య‌న‌మైన విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్..!

మాల్దీవుల‌కు ప‌య‌న‌మైన విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్..!

by Anji
Ad

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక.. వీరిద్దరి మధ్య వస్తున్న పుకార్లు ఇప్పటివి కాదు. వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ కొన్నేళ్లుగా వినిపిస్తున్నాయి. ఇటీవల విజయ్ దేవరకొండ నూతన గృహప్రవేశానికి జరిగినన వేడుకకు రష్మిక హాజరు కావడంతో మరోసారి ఈ జంట గురించి వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వీటిపై ఇటు విజయ్ కానీ, అటు రష్మిక గాని స్పందించలేదు. అయితే తాజాగా వీరిద్దరి గురించి మరో ఆసక్తికర విషయం తెర మీదకు వచ్చింది.

Advertisement

Also Read :  “గాడ్ ఫాద‌ర్” లో చిరంజీవి తండ్రిగా న‌టించిన ఈ న‌టుడిని గుర్తుపట్టారా..? ఒక‌ప్ప‌టి స్టార్ హీరో..!

అదేంటంటే వీరిద్దరూ కలిసి ఇప్పుడు మాల్దీవులకు వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతుంది. దీనికి కారణం వీరిద్దరూ ముంబై విమానాశ్రయంలో కనిపించడమే. రష్మిక ఎయిర్ ఫోర్ట్ కి చేరుకున్న కాసేపటికి విజయ్ దేవరకొండ కూడా వచ్చాడు. దీంతో మళ్లీ పుకార్లకు ఊతమిచ్చినట్లయింది. అసలు విషయం ఏంటంటే రష్మిక హీరోయిన్ గా నటించిన “గుడ్ బై” సినిమా అక్టోబర్ 7వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో రష్మిక అమితాబచ్చన్ కుమార్తె పాత్రలో కనిపించింది. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా ఆమె ముంబై ఎయిర్‌ఫోర్ట్‌లో ఫోటోగ్రాఫర్ల కెమెరాలకు చిక్కింది.

Advertisement


ఆమె అక్కడి నుంచి వెళ్లిన కాసేపటికే విజయ్ దేవరకొండ కూడా రావడంతో వీరిద్దరూ కలిసి మాల్దీవులకు వెళుతున్నారని ప్రచారం మొదలైంది. విజయ్, రష్మిక ఎయిర్‌ఫోర్టుకు చేరుకున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విజయ్ దేవరకొండ తో కలిసి రష్మిక గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు చేసింది. ఈ సమయంలో వీరిద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. అప్పట్లో చాలాసార్లు ఈ జంట బయట తిరుగుతూ మీడియాకి చిక్కారు. దీంతో వీరిద్దరి మధ్య అప్పటి నుంచే పుకార్లు మొదలయ్యాయి.

Also Read :  చిరంజీవి సినిమాకి ర‌జినీకాంత్ సినిమాకి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

Visitors Are Also Reading