Home » రాజ‌కీయ నాయ‌కులు న‌వ‌తరానికి ఎలా నిలుస్తారు..? : ఉప రాష్ట్రప‌తి

రాజ‌కీయ నాయ‌కులు న‌వ‌తరానికి ఎలా నిలుస్తారు..? : ఉప రాష్ట్రప‌తి

by Anji
Ad

నేటి రాజ‌కీయ నాయ‌కుల తీరుపై ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. పార్ల‌మెంట్లో స‌భ్యుల తీరుపై త‌న‌దైన శైలిలో సెటైర్లు వేశారు. న‌వ‌త‌ర‌నికి ఆద‌ర్శంగా నిల‌వాల్సిన నాయ‌కులే.. బెంచీల మీద ఎక్క‌డం, కుర్చీలు విసురుకోవ‌డం మైకులు ప‌గుల‌గొట్ట‌డం, అవినీతిలో కూరుకుపోవ‌డం, పార్ల‌మెంట్ వేదిక‌ను దుర్వినియోగం చేయ‌డం చేస్తుంటే.. ఇక న‌వ‌త‌రానికి ఎలా నిలుస్తార‌ని ప్ర‌శ్నించారు.

Advertisement

Advertisement

స‌మాజంలో ఉండాల్సిన నాలుగు సీల స్థానంలో అన‌వ‌స‌ర‌మైన నాలుగు సీల‌ను తెచ్చార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. గుంటూరు జిల్లాలో పాటిబండ్ల సీతారామ‌య్య హై స్కూల్లో వ‌జ్రోత్స‌వాల్లో వెంక‌య్య‌నాయుడు పాల్గొని ప్ర‌సంగం చేశారు. భావి భార‌త పౌరులు అయిన విద్యార్థుల‌లో స్పూర్తిని నింపేవిధంగా ఉప రాష్ట్రప‌తి ప్ర‌సంగించారు.

Also Read :  SARKARU VARI PATA : స‌ర్కారు వారి పాట అప్డేట్…మ‌హేశ్ లుక్ మామూలుగా లేదుగా…!

Visitors Are Also Reading