Home » ప‌వ‌న్ కు రాజ‌కీయాలు అచ్చిరావు..జ‌న‌సేన ఉండ‌దు..వేణుస్వామి సంచ‌ల‌న కామెంట్స్..!

ప‌వ‌న్ కు రాజ‌కీయాలు అచ్చిరావు..జ‌న‌సేన ఉండ‌దు..వేణుస్వామి సంచ‌ల‌న కామెంట్స్..!

by AJAY
Ad

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటూ రాజ‌కీయాల్లోనూ ఎంతో చురుగ్గా ఉంటూ ముందుకు వెళుతున్నారు. ప‌వ‌న్ తన అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీలో కీల‌కంగా ప‌నిచేశారు. ముఖ్యంగా తెలంగాణ‌లో స్టార్ కాంపెయినర్ గా ఎంతో మందిని ఆకట్టుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల చిరు పార్టీని క్లోజ్ చేశారు. ఆ స‌మ‌యంలో ప‌వ‌న్ ఎంతో ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్టు స‌న్నిహితులు చెబుతుంటారు. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ కు చిన్న‌నాటి నుండే రాజ‌కీయాల‌పై ఆస‌క్తి సామాజిక సేవ చేయాల‌నే కాంక్ష ఉండ‌టంతో తానే సొంతంగా జ‌న‌సేన‌ను స్థాపించారు. కానీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీచేయ‌గా ప‌వ‌న్ కు ఊహించని షాక్ త‌గిలింది.

venu swami

venu swami

ఆయ‌న పోటీచేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోవ‌డం అంద‌ర్నీ షాక్ గురి చేసింది. కానీ ప్ర‌స్తుతం ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గెలుస్తూ జ‌న‌సేన నిల‌దొక్కుకుంటోంది. అయితే ఇలాంటి స‌మయంలో ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి చెప్పిన జోస్యం సంచ‌ల‌నం గా మారింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ జాత‌కం ప్ర‌కారం ఆయ‌న‌కు రాజ‌కీయాలు అచ్చిరావ‌ని వేణు స్వామి చెప్పారు. అంతే కాకుండా భ‌విష్య‌త్ లో జ‌న‌సేన పార్టీనే ఉండ‌దు అంటూ వేణుస్వామి సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే ప‌వ‌న్ 2024 ఎన్నిక‌ల కోసం పార్టీని బ‌లోపేతం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

Advertisement

ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై త‌ర‌చూ గ‌ళం విప్పుతూ పార్టీని బ‌లోపేతం చేస్తున్న వేళ వేణు స్వామి కామెంట్లు సంచ‌ల‌నంగా మారాయి. వేణు స్వామి అంద‌రు జ్యోతిష్యుల్లాగా అయితే లైట్ తీసుకునేవారేగానీ ఆయ‌న చెప్పిన ప‌లు విష‌యాలు ఇప్ప‌టికే జ‌రిగాయి. అఖిల్ పెళ్లి జ‌ర‌గ‌దు అని వేణు స్వామి జోస్యం చెప్పారు. పీట‌ల‌పైకి ఎక్క‌కుండానే అఖిల్ పెళ్లి ఆగిపోయింది. స‌మంత చైతూ పెళ్లి పెటాకులు అవుతుంది. అది కూడా జ‌రిగింది. అంతే కాకుండా చంద్ర‌బాబు ఓడిపోతార‌ని కూడా వేణు స్వామి చెప్పారు. చెప్పిన‌ట్టుగానే జ‌రిగింది. మ‌రి ప‌వ‌న్ విష‌యంలో వేణు స్వామి జోస్యం ఎలా ప‌నిచేస్తుందో చూడాలి.

Also Read : తొలి సినిమానే త‌మ ఇంటిపేరుగా మార్చుకున్న సెల‌బ్రెటీలు వీరే..!

Visitors Are Also Reading