మహేష్ బాబు కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో అతడు సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటించింది. సినిమాలో సోను సూద్ మహేష్ బాబుకు స్నేహితుడిగా నటించి అతడినే మోసం చేసే పాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమాలో త్రివిక్రమ్ రాసిన మాటలు బుల్లెట్లలా దూసుకుపోతాయి. సినిమాలోని ఒక్కో డైలాగ్ ఒక్క రేంజ్ లో ఉండటంతో థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. ఇక ఇలాంటి సినిమాను టాలీవుడ్ లో చాలామంది స్టార్స్ మిస్ చేసుకున్నారు.
Advertisement
నిజానికి మొదట త్రివిక్రమ్ అతడు సినిమా కథను ఉదయ్ కిరణ్ తో చేయాలనుకున్నాడు. కానీ అప్పట్లో చిరు కూతురుతో ఉదయ్ కిరణ్ నిశ్చితార్థం తరవాత అల్లు అరవింద్ ఉదయ్ కిరణ్ డేట్స్ చూసుకునేవారు. అల్లు అరవింద్ రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా ఉదయ్ కిరణ్ మిస్ చేసుకున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ ఈ సినిమా కథను పవన్ కళ్యాణ్ కు సైతం విడిపించారు. కానీ పవన్ కూడా ఈ కథను రిజెక్ట్ చేశారు.
Advertisement
దాంతో త్రివిక్రమ్ ఫైనల్ గా మహేష్ బాబుకు కథ చెప్పగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాకుండా ఈ సినిమాలో నాజర్ చేసిన పాత్ర కోసం శోభన్ బాబును అనుకున్నారట. కానీ శోభన్ బాబు దానిని రిజెక్ట్ చేసారట. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం తాజాగా తెలిసింది.
ఈ చిత్రంలో సోనూసూద్ పాత్ర కోసం త్రివిక్రమ్ తనను సంప్రదించాడని తొట్టెంపూడి వేణు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కానీ తాను సినిమా చేయనని చెప్పినట్టు తెలిపారు. త్రివిక్రమ్ తనకు చాలా మంచి పాత్రలు ఆఫర్ చేశాడని… కానీ తానే రిజెక్ట్ చేశానని వెల్లడించారు.