Home » వేణుమాద‌వ్ 10 ఎక‌రాల భూమితో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఉన్న ఒప్పందం ఏంటో తెలుసా…?

వేణుమాద‌వ్ 10 ఎక‌రాల భూమితో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఉన్న ఒప్పందం ఏంటో తెలుసా…?

by AJAY

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గతి కుటుంబం నుండి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వేణు మాద‌వ్ స్టార్ క‌మెడియ‌న్ గా ఎదిగారు. కాలేజీ రోజుల్లో మిమిక్రీ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న వేణు మాదవ్ ఆ త‌ర‌వాత స్టేజ్ షో లు చేస్తూ మెల్లి మెల్లిగా ఎదిగి సినిమాల వ‌ర‌కూ వ‌చ్చారు. వంద‌ల సినిమాల్లో క‌మెడియ‌న్ గా న‌టించి ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించారు. స్టార్ హీరోల ప‌క్క‌న న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక చిన్న వ‌య‌సులోనే వేణుమాద‌వ్ అనారోగ్యం భారిన ప‌డి క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఇక ప్ర‌స్తుతం వేణు మాదవ్ భార్య త‌న ఇద్ద‌రు కొడుకులతో క‌లిసి హైద‌రాబాద్ లోనే ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా త‌న కొడుకుల‌తో వేణు మాదవ్ స‌తీమ‌ణి ఓ ఇంట‌ర్వ్యూలో హాజ‌ర‌య్యారు. ఈ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

వేణు మాద‌వ్ ప‌ది ఎక‌రాల పొలాన్ని కొనుగోలు చేశార‌ని చెప్పారు. అయితే ఆ ప‌ది ఎక‌రాల భూమిలో పండించిన బియ్యంలో కొంత ప‌వ‌న్ క‌ల్యాణ్ గారి ఇంటికి పంపిస్తామ‌ని చెప్పారు. వేణు మాద‌వ్ ప్ర‌తి సంవ‌త్స‌రం బియ్యం పంపేవార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మ‌కు మామిడి కాయ‌లు పంపించేవార‌ని చెప్పారు. ఇద్ద‌రికీ ఒక‌రిపై మ‌రొక‌రికి ఉన్న ఇష్టంతో అలా పంపుకునేవార‌ని అన్నారు.

వేణు మాదవ్ లేకున్నా తాము బియ్యం పంపిస్తున్నామ‌ని వాళ్లు మామిడికాయ‌లు పంపిస్తుంటార‌ని అన్నారు. అంతే కాకుండా నాగ‌బాబు ఫోన్ చేసి మాట్లాడుతార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి ప‌ల‌క‌రిస్తార‌ని అన్నారు. ఇక వేణు మాద‌వ్ ఇద్ద‌రు కుమారుల్లో ఒక‌రు ద‌ర్శ‌కుడిగా అవ్వాల‌ని ఉంద‌ని చెప్ప‌గా మ‌రొక‌రు మంచి న‌టుడు అవ్వాల‌ని ఉంద‌ని చెప్పారు.

ALSO READ: చైతూ త‌ల్లి ద‌గ్గుబాటి ల‌క్ష్మి గురించి ఎవ‌రికీ తెలియ‌ని విష‌యాలు..? నాగార్జునతో ఎందుకు విడిపోయారంటే..!

Visitors Are Also Reading