Home » ఆ హీరోయిన్ మరణాన్ని తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్న వెంకీ.. కారణం ఇదేనా..?

ఆ హీరోయిన్ మరణాన్ని తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్న వెంకీ.. కారణం ఇదేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఒకప్పుడు తన అందచందాలతో సినిమా ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపేసింది. బాలీవుడ్లో 16 సంవత్సరాలకే హీరోయిన్ అయినా ఆమె తెలుగులో కూడా అనేక సినిమాలు చేసింది. అప్పటికే ఆమె ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.. మరి అతి చిన్న వయసులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఎవరు అనుకుంటున్నారా? దివంగత హీరోయిన్ దివ్యభారతి. తెలుగు ఇండస్ట్రీ లో అతి తక్కువ సమయంలోనే వెంకటేష్,బాలకృష్ణ, చిరంజీవి,మోహన్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించింది. అలాగే తమిళ్ లో కూడా చాలా సినిమాలు చేసింది.. అయితే స్టార్ హీరో వెంకటేష్ సరసన బొబ్బిలి రాజా సినిమా లో దివ్యభారతి హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీసు వద్ద బంపర్ హిట్ కొట్టింది.

Advertisement

దీని తర్వాత మెగాస్టార్ తో రౌడీ అల్లుడు సినిమాలో నటించి హిట్ అందుకుంది. ఇక మోహన్ బాబుతో అసెంబ్లీ రౌడీ మూవీ లో చేసి మరో సూపర్ హిట్ అందుకుంది. అసెంబ్లీ రౌడీ సినిమా లో మోహన్ బాబు మరియు దివ్యభారతి మధ్య సన్నివేశాలు చూస్తుంటే అసలు దివ్యభారతి చనిపోయిందా అని మనకు అనుమానం కలుగుతుంది. అలా నటించింది ఆ సినిమాలో. ఇక బాలకృష్ణతో ధర్మక్షేత్రం అనే మూవీ లో జత కట్టింది. దివ్యభారతి తను చనిపోయే సమయంలో తమిళ హీరో ప్రశాంత్ పక్కన తొలిముద్దు సినిమా లో కూడా నటిస్తోంది. ఆ మూవీ పూర్తయిన వెంటనే వెంకటేష్ హీరోగా మరో సినిమాలో దివ్యభారతి హీరోయిన్ గా తీసుకోవాలని అప్పటికే వెంకటేశ్ రికమండ్ చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బొబ్బిలి రాజా ఇండస్ట్రీ హిట్ కొట్టింది కాబట్టి.వీరి కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుందని భావించారట వెంకీ. బొబ్బిలి రాజా సినిమా తర్వాత దివ్యభారతి మరియు వెంకటేష్ చాలా సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే దివ్యభారతి హఠాత్తుగా మరణించింది. దీంతో వెంకటేష్ తీవ్ర ఆవేదనతో ముంబై వెళ్లి ఆమె పార్థివ దేహానికి నివాళులు అర్పించి కన్నీటిపర్యంతమయ్యారు. ఏది ఏమైనా అతి చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన దివ్య భారతి మరణించడం ఇండస్ట్రీలో కలవరపెట్టే విషయమే.

also read:

Visitors Are Also Reading