Home » బాలయ్యకు జగన్ షాక్.. వీరసింహారెడ్డి సినిమాపై ఆంక్షలు !

బాలయ్యకు జగన్ షాక్.. వీరసింహారెడ్డి సినిమాపై ఆంక్షలు !

by Bunty
Ad

బాలకృష్ణ, శ్రుతిహాసన్ ల తొలి కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తుండగా, కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా కనిపించనున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీపై నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

Advertisement

ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, పోస్టర్స్ అన్ని వీరసింహారెడ్డి పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచేసాయి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున విడుదల అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఈనెల 6న ఒంగోలులోని ఏబీఎన్ గ్రౌండ్స్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని తలపెట్టారు. కానీ తాజాగా ఏపీ పోలీసులు వీరసింహారెడ్డి చిత్ర యూనిట్ కు షాక్ ఇచ్చారు. ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని, అభిమానుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని వేదిక మార్చుకోవాలని పోలీసులు సూచించారు.

Advertisement

ఒంగోలు నగరంలో ఈవెంట్ నిర్వహించడం వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలిగే అవకాశం ఉందని పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ప్రత్యామ్నాయ వేదిక కోసం వీరసింహారెడ్డి యూనిట్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. మరి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏపీలో జరుపుతారా లేదా హైదరాబాదులో జరుపుతారా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ చిత్రం యాక్షన్, ఎమోషన్స్, విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

READ ALSO : తోడు కావాలనిపిస్తుంది కానీ, నాకు అదే అడ్డు…రెండో పెళ్లి పై ప్రగతి కామెంట్స్!

Visitors Are Also Reading