Home » వీర సింహారెడ్డి నుండి బాలయ్య డైలాగ్ లీక్…ఫ్యాన్స్ కు పూనకాలే…!

వీర సింహారెడ్డి నుండి బాలయ్య డైలాగ్ లీక్…ఫ్యాన్స్ కు పూనకాలే…!

by AJAY
Ad

నట‌సింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాల‌తో దూసుకుపోతున్నారు. బాలయ్య హీరోగా నటించిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. అఖండ విజయంతో బాలయ్య రాబోయే సినిమాలపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే బాలయ్య పరుస‌ సినిమా షూటింగ్ ల‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య హీరోగా నటిస్తున్న సినిమాలలో వీర సింహారెడ్డి సినిమా కూడా ఒకటి.

Advertisement

ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టైటిల్ పోస్ట‌ర్ ను విడుదల చేయగా బాలయ్య ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పోస్టర్ లో బాలకృష్ణ ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నారు.

Advertisement

ఈ సినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెర‌కెక్కుతున్న‌ సంగతి తెలిసిందే. దాంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక బాలయ్య సినిమాలు అంటే భారీ ఫైట్లతో పాటు అదిరిపోయే డైలాగులు ఉండాల్సిందే. బాలయ్య నోటి నుంచి డైలాగులను వినందుకే చాలామంది థియేటర్లకు వెళుతుంటారు.

Balayya

Balayya

ఇక వీర సింహారెడ్డి సినిమాలో కూడా అదే రేంజ్ లో డైలాగులు ఉండబోతున్నాయి. ఈ సినిమా నుండి దర్శకుడు గోపీచంద్ మలినేని ఇప్ప‌టికే ఓ డైలాగును లీక్ చేయ‌గా నెట్టింట వైర‌ల్ అవుతోంది. వీరసింహారెడ్డి.. పుట్టింది పులిచెర్ల, చదివింది అనంతపురం. రూలింగ్ కర్నూల్….. అనే డైలాగ్ ను డైరెక్ట‌ర్ లీక్ చేశారు. ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌టంతో బాలయ్య ఫ్యాన్స్ కుషీ అవుతున్నారు.

Visitors Are Also Reading