Home » Veera Simha Reddy Trailer : ‘వీర సింహారెడ్డి’ ట్రైలర్ రిలీజ్.. జగన్ ప్రభుత్వంపై బాలయ్య పంచ్ లు ?

Veera Simha Reddy Trailer : ‘వీర సింహారెడ్డి’ ట్రైలర్ రిలీజ్.. జగన్ ప్రభుత్వంపై బాలయ్య పంచ్ లు ?

by Bunty
Ad

బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం వీరసింహారెడ్డి. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Advertisement

రిషి పంజాబీ సినిమాటోగ్రఫీగా, స్టార్ రైటర్ సాయి మాధవ్, బుర్ర వీరసింహారెడ్డి పవర్ఫుల్ డైలాగ్స్ ని అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఏ.ఎస్.ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రం కోసం దాదాపు రూ. 110 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఒంగోలులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ను కాసేపటి క్రితమే చిత్ర బృందం విడుదల చేసింది.

Advertisement

 

ఈ సందర్భంగానే ఈ సినిమా ట్రైలర్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే ఎప్పటిలాగే బాలయ్య తన పవర్ఫుల్ పర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. మాస్ ఫ్యాన్స్ కు దగ్గరగా ఉండేలా ఆయన కటౌట్ ఈ ట్రైలర్ లో మనం చూడవచ్చు. అటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ ట్రైలర్ కు బాగానే సెట్ అయింది. ఈ ట్రైలర్ లో ఏపీ ప్రభుత్వంపై బాలయ్య పంచులు పేల్చారు. అప్పట్లోఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చిన విషయాన్ని గుర్తు చేస్తూ… ఈ సినిమాలో డైలాగులు చెప్పారు బాలయ్య. సంతకాలు పెడితే బోర్డుల పేర్లు మారతాయి కానీ… ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మార్చలేరు… అంటూ బాలయ్య పవర్ఫుల్ డైలాగ్ చెబుతారు. అయితే ఈ డైలాగు విన్న టిడిపి అభిమానులు మాత్రం జగన్ ను ఉద్దేశించి ఈ డైలాగు పెట్టారని కామెంట్లు చేస్తున్నారు.  ఓవరాల్ గా సినిమా హైపును ఈ ట్రైలర్ అమాంతం పెంచేసింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

Visitors Are Also Reading