Home » ప్రభాస్ పాన్ ఇండియా డైరెక్టర్ తో వరుణ్ తేజ్..?

ప్రభాస్ పాన్ ఇండియా డైరెక్టర్ తో వరుణ్ తేజ్..?

by Azhar
Ad

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ మధ్యే కొంత గ్యాప్ తో రెండు సినిమాలతో అభిమానుల ముందుకు వచ్చాడు. అందులో మొదటగా ఎన్నో అంచనాల మధ్య వచ్చిన గని సినిమా దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఏ ఈసినిమా థియేటర్లోకి వచ్చిన రెండో రోజే అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ ఫెల్యూర్ తర్వాత వచ్చిన ఎఫ్3 సినిమా మాత్రం సూపర్ అయ్యింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో వరుణ్ కొంత రిలాక్స్ అయ్యాడు. కానీ ఈ మెగా ప్రిన్స్ తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయం పై ఇక క్లారిటీ రాలేదు.

Advertisement

కానీ ఇప్పుడు వస్తున్న తాజా సమాచారం ప్రకారం వరుణ్ తర్వాతి సినిమా ప్రభాస్ పాన్ ఇండియా డైరెక్టర్ తో చేయనున్నాడు అని తెలుస్తుంది. అతను మరెవరో కాదు సుజిత్. ప్రభాస్ తో బాహుబలి తర్వాత సాహో సినిమా తెరకెక్కించిన సుజిత్ అంచనాలను అందుకోలేకపోయాడు అనే చెప్పాలి. సాహో సినిమా ఇక్కడ సౌత్ లో అంతగా హిట్ కాకపోయినా బాలీవుడ్ లో మాత్రం మంచి విజయం అందుకుంది. నార్త్ లో 200 కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేసి బతికిపోయింది సాహో. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ వరుస సినిమాలు చేస్తున్న.. సిజిత్ మాత్రం తన తర్వాత సినిమా మాత్రం విడుదల చేయలేదు.

Advertisement

ఈ క్రమంలోనే చిరంజీవితో లూసిఫర్ రీమేక్ చేయనున్నాడు అని వార్తలు వచ్చిన… అది జరగలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే మెగా కాంపౌండ్ హీరో అయిన వరుణ్ తేజ్ తో తర్వాత సినిమా సుజిత్ చేయబోతున్నాడు అని తెలుస్తుంది. ఈ మధ్యే వరుణ్ కు కథ కూడా చెప్పినట్లు తెలుస్తుంది. అయితే గని వంటి ప్లాప్ తర్వాత వరుణ్ తన తర్వాత సినిమా చాలా జాగ్రత్తగా ఎంచుకుంటాడు అనేది తెలిసిందే. అలాగే సిజిత్ కూడా ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని బలంగా నిర్ణయించుకున్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

ఇవి కూడా చదవండి :

ఫీల్డర్ కావాలనే బాల్ ను బౌండరీ బయటకు వేస్తే ఏం చేస్తారో తెలుసా..?

కోహ్లీకి కరోనా పాజిటివ్ నిజమే.. కానీ…?

Visitors Are Also Reading