Home » ‘వారసుడు’ రిలీజ్‌కు ముందే విషాదం.. మూవీ ఆర్ట్‌ డైరెక్టర్‌ మృతి!

‘వారసుడు’ రిలీజ్‌కు ముందే విషాదం.. మూవీ ఆర్ట్‌ డైరెక్టర్‌ మృతి!

by Bunty
Ad

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటివరకు చాలామంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలామంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంతమంది మరణిస్తే, మరి కొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. దక్షిణ భారత సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన సునీల్ బాబు కన్నుమూశారు.

Advertisement

ఆయన వయసు 50 ఏళ్లు. గుండెపోటుతో ఎర్నాకులంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి 11 గంటలకు తుది శ్వాస విడిచారని తెలుస్తోంది. మూడు రోజుల క్రితం సునీల్ కాలు నుంచి చీము లాంటి ఒక ద్రవం రావడంతో ఆయన ఆసుపత్రిలో చేరాడు. కేరళలోని పాతనంతిట్టలోని మల్లాపల్లికి చెందిన సునీల్ మలయాళం, తమిళం, తెలుగు, బాలీవుడ్ చిత్రాల్లో ఆర్ట్ డైరెక్టర్ గా బిజీగా ఉన్నారు.

Advertisement

విజయ్ హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘వారిసు’ సినిమాకు సునీల్ బాబు చివరిగా పనిచేశారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా మరో వారంలో విడుదల కావాల్సి ఉండగా, సునీల్ ఇప్పుడు చనిపోవడం సినిమా యూనిట్ అంతా షాక్ లో ఉండిపోయింది. వివిధ భాషల్లో 100 సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన సునీల్ బాబు గత ఏడాది సూపర్ హిట్ అందుకున్న సీతారామం సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక సునీల్ బాబు మృతి పట్ల పలుగురు సంతాపం తెలుపుతున్నారు.

READ ALSO : చంటి లాంటి హిట్ మూవీని మిస్ చేసుకున్న హీరో ఎవ‌రో తెలుసా..?

Visitors Are Also Reading