ఎన్టీరామారావు వాణిశ్రీ హీరోహీరోయిన్ లుగా నటించిన సినిమా ఎదురులేని మనిషి. ఈ సినిమాను అశ్వినీదత్ నిర్మించారు. అయితే ఈ సినిమాలో ఓ పాట చేసేందుకు వాణిశ్రీ ఎంతో ఇబ్బంది పడ్డారు. ఆకతాయి అనే పాట షూటింగ్ జరుగుతున్న సమయంలో వాణిశ్రీకి కొరియోగ్రాఫర్ స్టెప్పులు చెప్పారు. ఆ వెంటనే వాణిశ్రీ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చి అన్నగారు ఆ పాటలో స్టెప్పులు దారుణంగా ఉన్నాయని చెప్పారట.
Advertisement
మీరు చెబితే బాగుంటుందని వాణి శ్రీ ఎన్టీఆర్ ను కోరారట. కానీ ఎన్టీఆర్ నేను చెప్పను వాణిశ్రీ గారు….ఇప్పుడు ట్రెండ్ అదే, డబ్బులు పెట్టేది వాళ్లు కాబట్టి మనం వాళ్లకు చెప్పలేం. కాబట్టి మీరు సర్దుకుపోతే సరిపోతుందని అన్నారట. అయినప్పటికీ మీరు మరోసారి చెబితే బాగుంటుందని వాణిశ్రీ అన్నారట.
Advertisement
కానీ ఎన్టీఆర్ మీరు మహా అయితే మరో ఐదేళ్లు నటిస్తారు. కాబట్టి ఒకటి మీరు మేకర్స్ చెప్పినట్టు చేయాలి లేదా రెండోది మీరు పూర్తిగా మానేయాలి…నాకు తెలిసి మనం రెండోది ఫోలో అవ్వడమే మంచిది అని చెప్పారట. దాంతో చేసేది లేక వాణిశ్రీ కూడా ట్రెండ్ ఫాలో అవ్వాలని నిర్ణయించుకుని వాళ్లు చెప్పినట్టు చేయడమే కరెక్ట్ అనే నిర్ణయానికి వచ్చారట.
కానీ ఆ తరవాత మాత్రం వాణీ శ్రీముందే సినిమాల్లో డ్యూయెట్ లు చేయకూడదని నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయాన్ని వాణిశ్రీ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అయితే ఇప్పటి హీరోయిన్ లు మాత్రం అలాంటి హద్దు ఏమీ పెట్టుకోవడం లేదు.