Home » చిరు పక్కన స్టెప్పులు వేయడానికి ఊర్వశి అన్ని కోట్లు తీసుకుందా…?

చిరు పక్కన స్టెప్పులు వేయడానికి ఊర్వశి అన్ని కోట్లు తీసుకుందా…?

by AJAY
Ad

తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్ లకు ఉన్న క్రేజ్ గురించి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తెలుగు సినిమా అయితే కచ్చితంగా ఒక స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే. అంతేకాకుండా స్పెషల్ సాంగ్ కోసం ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ లు సైతం రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో ఊర్వశీ రోటేలా స్పెషల్ సాంగ్ లో నటించింది.

Advertisement

బాస్ పార్టీ పాటలో ఊర్వశీ చిరంజీవి పక్కన స్టెప్పులు వేసింది. అయితే ఈ పాట కోసం ఏకంగా 30 కోట్లు ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు స్పెషల్ సాంగ్ కోసం ఈ రేంజ్ లో ఖర్చు పెట్టడం ఇదే మొదటిసారి అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ పాట కోసం ఊర్వశికి రెండు కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.

Advertisement

కేవలం 3 నిమిషాల పాట కోసం ఊర్వశీ ఆ రేంజ్ లో తీసుకోవడంతో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా ఈ సినిమాలో విలన్ గా నటించిన ప్రకాష్ 1.5 కోట్లు తీసుకోగా…. ప్రకాష్ రాజ్ కంటే ఊర్వశికే ఎక్కువ రెమ్యునరేషన్ అందింది. ఇక వాల్తేరు వీరయ్య సినిమాకు దేవిశ్రీ స్వరాలు సమకూర్చగా సినిమాలో బాస్ పార్టీ పాట సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇక మ్యూజిక్ కి తగ్గట్టుగా ఊర్వశి స్టెప్పులు వేయడంతో ఈ పాట క్రేజ్ మరింత పెరిగిపోయింది.

Visitors Are Also Reading