Home » తండ్రీ కొడుకులుగా బాల‌య్య డ‌బుల్ యాక్ష‌న్..?

తండ్రీ కొడుకులుగా బాల‌య్య డ‌బుల్ యాక్ష‌న్..?

by AJAY
Ad

అఖండ విజ‌యంతో ఫుల్ జోష్ మీద ఉన్న బాల‌య్య ఇప్ప‌టికే గోపించంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో సినిమాను మొద‌లు పెట్టారు. ఈ సినిమా కూడా మాస్ ఎంట‌ర్టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. మైత్రిమూవీమేక‌ర్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా బాల‌య్య కెరీర్ లో 107వ సినిమాగా తెర‌కెక్కుతోంది. భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement

Advertisement

రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ సిరిసిల్ల జిల్లాలో ప్రారంభం అయ్యింది. అంతే కాకుండా ఈ చిత్రానికి కూడా త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ టాక్ ప్ర‌కారం ఈ సినిమాలో బాల‌య్య డ‌బుల్ రోల్ చేస్తున్నారు. తండ్రీ కొడుకుగా బాల‌య్య న‌టించ‌బోతున్నాడు. అంతేకాకుండా ఈ సినిమా రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రం నీటి స‌మ‌స్య చుట్టూ తిరుగుతుంద‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి వీర సింహారెడ్డి అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు ఈ చిత్రంలో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టిస్తుంది. ఇక సినిమాల్లో బాల‌య్య‌కు విలన్ గా దునియా విజ‌య్ పేరు వినిపిస్తోంది.

Visitors Are Also Reading