Home » బోణీ కపూర్ కంటే ముందు టాలీవుడ్ నుండి శ్రీదేవికి వచ్చిన సంబంధాలు ఏవో తెలుసా…!

బోణీ కపూర్ కంటే ముందు టాలీవుడ్ నుండి శ్రీదేవికి వచ్చిన సంబంధాలు ఏవో తెలుసా…!

by AJAY
Ad

అందం నటనతో సినిమా పరిశ్రమలో ఎనలేని గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ అతిలోక సుందరి శ్రీదేవి. ఎన్టీరామారావు నుండి చిరంజీవి వరకు రెండు తరాల స్టార్ హీరోలతో శ్రీదేవి సినిమాలు చేసి అలరించింది. బాలనటిగానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి తన అద్భుత నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా కన్నడ, హిందీ భాషల్లో స్టార్ హీరోల పక్కన నటించి దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.

Advertisement

అంతేకాకుండా తనకు ఉన్న క్రేజ్ తో శ్రీదేవి నేషనల్ బ్యూటీ గా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లో బిజీ గా మారిన తర్వాత శ్రీదేవి సౌత్ కు దూరం అయింది. శ్రీదేవి తో సినిమా చేయాలని హీరోలు దర్శకులు కోరుకున్నా ఆమె డేట్స్ అంత ఈజీగా దొరికేవి కావు. ఇక శ్రీదేవి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే….. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రస్తుతం పెద్ద కూతురు జాహ్నవి కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

ఇదిలా ఉంటే బోనికపూర్ కంటే ముందే శ్రీదేవికి ముగ్గురు హీరోలతో పెళ్లి సంబంధాలు వచ్చాయని అప్పట్లో వార్తలు వినిపించాయి. మొదట టాలీవుడ్ హీరో రాజశేఖర్ తో శ్రీదేవి వివాహం జరిపించాలని ఆమె తల్లి అనుకున్నారట. అంతేకాకుండా ఈ విషయాన్ని రాజశేఖర్ కు కూడా చెప్పారట. అప్పుడు రాజశేఖర్ కెరీర్ లో బిజీగా ఉండటంతో పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రాజశేఖర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు. అదేవిధంగా సినీ హీరో, నిర్మాత మురళీమోహన్ తో శ్రీదేవి పెళ్లి జరగాల్సింది అని కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన మురళీమోహన్ పెళ్లికి నో చెప్పినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లోకి వెళ్ళిన తర్వాత మిథున్ చక్రవర్తితో శ్రీదేవి ప్రేమలో పడింది. చాలా రోజుల పాటు వీరు డేటింగ్ కూడా చేసినట్లు తెలుస్తోంది.

కానీ మొదటి భార్యను వదిలేస్తేనే శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని ఆమె తల్లి మిథున్ చక్రవర్తికి కండిషన్ పెట్టారు. కానీ మొదటి భార్యను విడిచి పెట్టెందుకు మిథున్ చక్రవర్తి నిరాకరించారు. ఆ తర్వాత శ్రీదేవి బోనికపూర్ తో ప్రేమలో పడింది. కొంతకాలం పాటు డేటింగ్ లో ఉన్న ఈ జంట పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. అంతే కాకుండా శ్రీదేవి బోణీ కపూర్ జీవితాంతం అన్యోన్యంగా కలిసి మెలిసి ఉన్నారు. కానీ శ్రీదేవి సడెన్ గా మరణించడం తో బోణీ కపూర్ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.

Also read :

య‌మ‌లీల సినిమా నుండి త‌ప్పుకునేలా సౌంద‌ర్య‌ను భ‌య‌పెట్టింది ఎవ‌రో తెలుసా..?

Visitors Are Also Reading