Home » వారంలో ఆ రెండు రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ షూటింగ్ కు వెళ్లని శోభన్ బాబు….ఎందుకో తెలుసా…?

వారంలో ఆ రెండు రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ షూటింగ్ కు వెళ్లని శోభన్ బాబు….ఎందుకో తెలుసా…?

by AJAY
Ad

ఒకప్పటి స్టార్ హీరోయిన్ లలో పీఆర్ వరలక్ష్మి కూడా ఒకరు. పీఆర్ వరలక్ష్మి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ చిత్రాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్నారు. వరలక్ష్మి కృష్ణావతారం సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమయ్యారు. ఏపీలోని నగరిలో ఆమె జన్మించారు. ఆ తర్వాత కృష్ణ, కృష్ణంరాజు, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలకు జోడిగా నటించారు.

ఆ తర్వాత మహేష్ బాబు బాలకృష్ణ సినిమాల్లోనూ నటించారు. ఇక ప్రస్తుతం వరలక్ష్మీ సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. కాక తాజా ఇంటర్వ్యూలో పీఆర్ వరలక్ష్మి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అంతేకాకుండా తను నటించిన సినిమాలలో హీరోల గురించి పలు విషయాలను షేర్ చేసుకున్నారు.

Advertisement

Advertisement

కృష్ణ, కృష్ణంరాజు ఇద్దరూ వెంట వెంటనే మరణించడం చాలా బాధగా ఉందని అన్నారు. వారిద్దరితో తాను పని చేశానని చెప్పారు. అంతేకాకుండా తాను శోభన్ బాబు తో కూడా సినిమాలు చేశానని అన్నారు. శోభన్ బాబు చాలా క్రమశిక్షణతో మెలిగే వారని చెప్పారు.

పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ని ఆయన బ్యాలెన్స్ చేసేవారు అంటూ తెలిపారు. శని, ఆదివారాల్లో ఆయన ఎట్టి పరిస్థితిలోనూ షూటింగ్ కు వచ్చేవారు కాదని అన్నారు. ఆ రెండు రోజులు కుటుంబంతోనే గడుపుతూ ఉండేవారని డబ్బు విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండే వారని అన్నారు. అంతే కాకుండా భూముల పై పెట్టుబడి పెట్టాలని ఆయన చెబుతూ ఉండేవారని చెన్నై లో ఆయన చాలా భూములు కొనుగోలు చేశారని చెప్పారు.

Also read : RRR : “నాటు, నాటు” పాట డ్యాన్స్ మాస్టర్ గురించి తెలుసా? అతను ఓ టైలర్ షాప్ ఓనర్

Visitors Are Also Reading