Home » భానుప్రియ చెల్లెలి జీవితంలో ఇంత విషాదం ఉందా..? ఏం జ‌రిగిందంటే..?

భానుప్రియ చెల్లెలి జీవితంలో ఇంత విషాదం ఉందా..? ఏం జ‌రిగిందంటే..?

by AJAY
Ad

ఒకప్పుడు టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్స్ లో భానుప్రియ కూడా ఒకరు. కూచిపూడి నాట్యం ద్వారా భానుప్రియ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొద‌ట డ్యాన్సర్ గా ఎంతో గుర్తింపు సాధించిన‌ భానుప్రియ ఆ తర్వాత సినిమా అవకాశాలను అందుకుంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన భానుప్రియ తల్లిదండ్రులు వృత్తిరీత్యా చెన్నైలో స్థిరపడ్డారు. అయితే చిన్ననాటి నుండి భరతనాట్యంలో రాణించిన భానుప్రియ ఆ తర్వాత సినిమా అవ‌కాశాలు రావడంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

Advertisement

స్టార్ హీరోలకు జోడీగా భానుప్రియ‌ సినిమాలు చేసింది. దాంతో తెలుగు, తమిళ భాషల్లో భానుప్రియకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇక హీరోయిన్ గా కెరీర్ కు పులిస్టాప్ పడిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ ఎంట్రీ ఇచ్చింది. హీరోలకు తల్లి అక్క వదిన లాంటి పాత్రలు చేస్తూ అభిమానులను సంపాదించుకుంది. అయితే తాజాగా భానుప్రియ సోదరికి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

భానుప్రియ చెల్లెలు శాంతి ప్రియ కూడా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ స్టార్ స్టేటస్ ను అందుకోలేక‌పోయింది. అంతేకాకుండా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడింది. శాంతి ప్రియ మహర్షి, జస్టిస్ రుద్రమదేవి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలకు గుడ్ బై చెప్పిన తర్వాత శాంతి ప్రియ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది.

అంతేకాకుండా రీసెంట్ గా బాలీవుడ్ లో ఒక వెబ్ సిరీస్ లో నటించింది. సునీల్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ లో శాంతి ప్రియ ముఖ్యమైన పాత్రలో నటించింది. ఇదిలా ఉంటే భానుప్రియ మాదిరిగానే శాంతిప్రియ జీవితంలోనూ ఎంతో విషాదం ఉంది. 1999లో శాంతి ప్రియ ఇండస్ట్రీకి చెందిన సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. కానీ 2004 లో సిద్దార్త రే మరణించారు. దాంతో శాంతి ప్రియ జీవితంలో తీరని విషాదం మిగిలిపోయింది.

Visitors Are Also Reading