Home » ఉమామహేశ్వరి జీవితం లో అన్ని కష్టాలు అనుభవించారా….ఎన్టీఆర్ కూతురే అయినా చిత్ర హింసలు…!

ఉమామహేశ్వరి జీవితం లో అన్ని కష్టాలు అనుభవించారా….ఎన్టీఆర్ కూతురే అయినా చిత్ర హింసలు…!

by AJAY
Ad

నందమూరి కుటుంబంలో విషాద ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీరామారావు చిన్న కుమార్తె కంటమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్యం…. మానసిక ఒత్తిడి కారణంగా ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. బంజారాహిల్స్ లోని తన నివాసంలో ఉమామహేశ్వరి చనిపోగా ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

 

Advertisement

అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనతో నందమూరి కుటుంబంలో విషాదం నిండుకుంది. ఎన్టీ రామారావు కు చిన్న కుమార్తె ఉమామహేశ్వరి అంటే చాలా ఇష్టమని వారి సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఉమామహేశ్వరి జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఎన్టీ రామారావు ఉమామహేశ్వరి ని మొదట నరేంద్ర రాజన్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. ఆ తర్వాత ఉమామహేశ్వరి నరేంద్ర రాజన్ దంపతులు కొంతకాలం అమెరికాలో ఉండేవారు. అయితే అప్పటికే నరేంద్ర రాజన్ కు మరో మహిళతో కూడా సంబంధం ఉండేదని ఉమామహేశ్వరి కి తెలిసింది. దాంతో నరేంద్ర రాజన్ ఉమామహేశ్వరిని చిత్రహింసలు పెట్టేవారట. మత్తు పదార్థాలు తీసుకోవడంతో పాటు ఉమామహేశ్వరిని శారీరకంగా హింసించే వారట.

ఈ విషయాన్ని ఉమామహేశ్వరి తన తండ్రి ఎన్టీ రామారావు కు తెలియజేసింది. దాంతో ఎన్టీ రామారావు వెంటనే నరేంద్ర రాజన్ తో విడాకులు ఇప్పించి కూతురికి రెండో పెళ్లి చేశారు. ఆ తర్వాత ఉమామహేశ్వరి జీవితం సంతోషంతో సాగింది. ఇటీవలే తన కూతురు నిశ్చితార్థాన్ని కూడా బంధుమిత్రుల మధ్యన ఘనంగా జరిపించారు. ఇక ఇప్పుడు అనారోగ్య కారణాలతో…. మానసిక ఒత్తిడితో ఆమె ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.

ALSO READ : అప్ప‌టి ఎన్టీఆర్‌, చిరంజీవి మాదిరిగా ఇప్ప‌టి త‌రం నెంబ‌ర్ వ‌న్ హీరో ఎవ‌రంటే..?

Visitors Are Also Reading