Home » “హనుమాన్ జంక్షన్” సినిమా ను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్స్ ఎవరో తెలుసా..? అడ్వాన్స్ తీసుకుని మరీ ఎందుకు రిటర్న్ ఇచ్చారంటే ..?

“హనుమాన్ జంక్షన్” సినిమా ను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్స్ ఎవరో తెలుసా..? అడ్వాన్స్ తీసుకుని మరీ ఎందుకు రిటర్న్ ఇచ్చారంటే ..?

by AJAY
Ad

దర్శకులు కొన్ని సినిమాలను మొదట ఒక హీరోతో అనుకుంటారు కానీ అనేక కారణాలవల్ల తర్వాత వేరే వాళ్లను హీరోగా తీసుకోవాల్సి వస్తుంది. అలా సినిమాలు చేతులు మారుతూ ఉంటాయి. అయితే అలా సినిమా చేతులు మారిన సందర్భంలో కొన్నిసార్లు సూపర్ హిట్ గా నిలిస్తే మరికొన్నిసార్లు ప్లాపులు కూడా వస్తాయి. అదేవిధంగా టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోలు హనుమాన్ జంక్షన్ సినిమాను మిస్ చేసుకున్నారు.

Advertisement

ఆ హీరో ఎవరు..? అసలు ఎందుకు మిస్ చేసుకోవాల్సి వచ్చింది..? అనేది ఇప్పుడు చూద్దాం. చిరంజీవి హీరోగా ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక హనుమాన్ జంక్షన్ సినిమాకు కూడా మోహన్ రాజానే డైరెక్టర్ గా పని చేశారు.

Advertisement

కాగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మోహన్ రాజా హనుమాన్ జంక్షన్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. హనుమాన్ జంక్షన్ సినిమాలో హీరోలుగా అర్జున్, జగపతిబాబు నటించగా వేణు తొట్టెంపూడి ముఖ్యమైన పాత్రలో నటించారు. అయితే ముందుగా హీరోలుగా అర్జున్ జగపతిబాబులను ఎంపిక చేయలేదని చెప్పారు. తాను ఈ సినిమాను మోహన్ బాబు, రాజశేఖర్ లతో చేయాలనుకున్నట్టు తెలిపారు. అంతేకాకుండా వాళ్ళిద్దరికీ అడ్వాన్సులు కూడా ఇచ్చామని తెలిపారు.

అయితే ఇద్దరు స్టార్ హీరోలు అవడంతో మేనేజ్ చేయగలనా లేదా అనే డౌట్ రావడంతో తన తండ్రికి చెప్పానని అన్నారు. ఇక తండ్రి జగపతిబాబు మరియు అర్జున్l లను ఎంపిక చేశారని వెల్లడించారు. మోహన్ రాజా తండ్రి మోహన్ ఈ సినిమాకు ఎడిటర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు థియేటర్లలో నవ్వులు పూసాయి.

Visitors Are Also Reading