Home » చిరంజీవి, వెంక‌టేష్ ల‌ను ఉద‌య్ కిర‌ణ్ అంత‌లా బ‌య‌పెట్టాడా..?అస‌లేం జరిగిందంటే..?

చిరంజీవి, వెంక‌టేష్ ల‌ను ఉద‌య్ కిర‌ణ్ అంత‌లా బ‌య‌పెట్టాడా..?అస‌లేం జరిగిందంటే..?

by AJAY
Published: Last Updated on
Ad

చిత్రం సినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ వరుస బ్లాక్ బస్టర్ లతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి త క్కువ కాలం లోనే స్టార్ గా ఎదిగాడు. నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి సినిమా లతో ఉదయ్ కిరణ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. లవర్ బాయ్ హీరోగా ఉదయ్ కిరణ్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిల కలల రాకుమారుడు గా ఉదయ్ మారిపోయాడు. యూత్ లో ఉదయ్ కిరణ్ కు ఎక్కువగా క్రేజ్ పెరిగిపోయింది. దాంతో స్టార్ డైరెక్టర్ లు నిర్మాతలు కూడా ఉదయ్ కిరణ్ డేట్స్ కోసం వేచి చూసేవాళ్ళు.

ఇవి కూడా చదవండి : Krishnam Raju Death : కృష్ణంరాజు అనారోగ్యానికి అస‌లు కార‌ణం అదేనా..?

Advertisement

అంతే కాకుండా ఉదయ్ కిరణ్ సినిమా విడుదల అవుతుంది అని స్టార్ హీరోలు సైతం సినిమా లను వాయిదా వేసుకున్నారు అంటే అతడి క్రేజ్ ఏ రేంజ్ లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు ఒక సందర్భం లో ఉదయ్ కిరణ్ ను వెంకటేష్, చిరంజీవిలు సినిమా విడుదల వాయిదా వేసుకోవాలని రిక్వెస్ట్ చేశారట. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన మనసంతా నువ్వే సినిమా సెప్టెంబర్ 2 న విడుదల కావాల్సి ఉంది.

Advertisement

అయితే అదే వారం లో వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్ సినిమా ను సెప్టెంబర్ 6 న విడుదల చేయాలని అనుకున్నారు. దాంతో మనసంతా నువ్వే సినిమా విడుదల ను వాయిదా వేసుకోవాలని నిర్మాత ఎం ఎస్ రాజును సురేష్ బాబు కోరారు. దాంతో మనసంతా నువ్వే సినిమా ను సెప్టెంబర్ 20 లేదా 27 న విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

udaykiran

udaykiran

అయితే అక్టోబర్ 4 న చిరంజీవి డాడీ సినిమా విడుదల కావాల్సి ఉంది. దాంతో నిర్మాత అల్లు అరవింద్ సినిమా విడుదల వాయిదా వేసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. దాంతో అక్టోబర్ 19 న మనసంతా నువ్వే సినిమా ను విడుదల చేసారు. ఈ సినిమ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి :టాలీవుడ్‌లో మ‌రో విషాదం.. రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు క‌న్నుమూత

Visitors Are Also Reading