Home » మీడియాలో ఆ వార్త చూసి కండ్లు ఎర్ర‌బ‌డేలా ఏడ్చేసిన ఉద‌య్ కిర‌ణ్..! ఆ వార్త ఏంటంటే..?

మీడియాలో ఆ వార్త చూసి కండ్లు ఎర్ర‌బ‌డేలా ఏడ్చేసిన ఉద‌య్ కిర‌ణ్..! ఆ వార్త ఏంటంటే..?

by AJAY
Ad

చిత్రం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత వరస సీట్లతో హ్యాట్రిక్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా చిత్రం, మనసంతా నువ్వే, నువ్వు నేను సినిమాలు మంచి విజయాలు సాధించడంతో తక్కువ కాలంలోనే ఉదయ్ కిరణ్ స్టార్ హీరోగా ఎదిగాడు. సొట్ట బుగ్గల అందంతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు. కానీ ఉదయ్ కిరణ్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చివరికి అతడిని ఆత్మహత్య చేసుకునేలా చేశాయి.

Advertisement

స్టార్ హీరోగా రానిస్తున్న‌ సమయంలో ఉదయ్ కిరణ్ కు ఎన్నో మంచి ఆఫర్లు వచ్చాయి. అయితే సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో వచ్చిన ఆఫర్లు అన్నీ తిరిగి వెనక్కి వెళ్లిపోయాయి. అంతేకాకుండా నటించిన సినిమాలు సైతం ఫ్లాప్ అవడం మొదలయ్యింది. దాంతో ఉదయ్ కిరణ్ డిప్రెషన్ లోకి వెళ్ళాడు.

Advertisement

udaykiran

udaykiran

చాలా కాలం పాటు డిప్రెషన్ లో ఉన్న ఉదయ్ కిరణ్ చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదిలా ఉండగా చిరంజీవి కూతురుతో ఎంగేజ్మెంట్ తర్వాత ఉదయ్ కిర‌ణ్ ను మీడియా హైలెట్ చేయ‌డం మొద‌లు పెట్టింది. కానీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత ఉదయ్ కిర‌ణ్ కు ఆఫ‌ర్ లు త‌గ్గ‌డంతో పాటూ మీడియా అత‌డిని టార్చర్ చేసిందట‌. అల్ల‌రి నరేష్ ఓ ఇంటర్వ్యూలో దీనికి సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్పాడు.

తాను ఉదయ్ కిర‌ణ్ ను కలవడానికి ఓసారి ఆయన ఇంటికి వెళ్లాన‌ని చెప్పాడు. ఆ సమయంలో ఉదయ్ కిర‌ణ్ ఏడ్చిన‌ట్టు అత‌డి కండ్లు ఎర్ర‌బడ్డాయని అన్నాడు. దాంతో తాను ఏమైంద‌ని ప్రశ్నించగా మొదట తోసుపుచ్చే ప్రయత్నం చేశాడట. కానీ నరేష్ గట్టిగా అడగటంతో అసలు విషయం చెప్పాడట. వార్తల్లో ఓ హీరో గురించి చెబుతూ ఉదయ్ కిరణ్ కి వచ్చిన పరిస్థితే ఈ హీరోకు కూడా వస్తుందా అంటూ వార్తలు రాసారని…. ఆ వార్తను చూపిస్తూ ఉదయ్ కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారట. అలా ఉదయ్ కిరణ్ బతికుండగానే మీడియా అతడిని వేధించిందని నరేష్ పేర్కొన్నాడు.

ALSO READ : అఖండ, ఆర్ఆర్ఆర్ తో పాటూ బింబిసార సినిమాలో ఉన్న ఈ కామన్ పాయింట్ ను గమనించారా….?

Visitors Are Also Reading