Home » సిగ్గులేదా… ఆమెను పెళ్లి చేసుకున్నావ్..అంటూ యాద‌మ్మ‌రాజు పై దారుణ‌మైన ట్రోలింగ్..!

సిగ్గులేదా… ఆమెను పెళ్లి చేసుకున్నావ్..అంటూ యాద‌మ్మ‌రాజు పై దారుణ‌మైన ట్రోలింగ్..!

by AJAY
Ad

తెలుగులో జబర్దస్త్ తర్వాత మళ్లీ అంతటి గుర్తింపు పటాస్ కామెడీ షోకి వచ్చింది. ప్రస్తుతం ఈ షో ప్రసారం అవడం లేదు కానీ చాలా రోజుల పాటు ఈ షో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించింది. యాంకర్ రవి, శ్రీముఖి కలిసి పటాస్ షోకు యాంక‌ర్స్ గా పనిచేశారు. ఇక షో ద్వారా చాలా మంది క‌మెడియ‌న్స్ పరిచయమయ్యారు. ప్రస్తుతం పటాస్ ద్వారా పరిచయమైన కమెడియన్లు శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ తో పాటు ఇతర టీవీ షోల‌లో సందడి చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది సినిమాల్లో నటిస్తున్నారు.

 

Advertisement

ఇక పటాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్ లో యాదమ్మ రాజు కూడా ఒకరు. యాదమ్మ రాజు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్కిట్ లు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అల‌రిస్తున్నారు. యాద‌మ్మ‌రాజు త‌న కామెడీ టైమింగ్ తో చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సినిమాలతో పాటు ఇతర టీవీ షోలలో యాదమ్మ రాజు నటిస్తున్నాడు.

Advertisement

ఇదిలా ఉంటే తాజాగా యాదమ్మ రాజు ఎంగేజ్మెంట్ జరిగింది. గతంలో ఓ టీవీ షోలో యాదమ్మ రాజు తన ప్రేయసి స్టెల్లాను ప్రేక్షకులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరు కలిసి సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. యాద‌మ్మ రాజుతో పాటూ స్టెల్లాకు కూడా సోష‌ల్ మీడియాలో సెల‌బ్రెటీ రేంజ్ లో ఫాలోవ‌ర్స్ ఉన్నారు. యూట్యూబ్ లో స్టెల్లాతో క‌లిసి యాద‌మ్మ రాజు ఫ‌న్నీ మ‌రియు లవ్ వీడియోలు చేస్తుంటారు. ఇక తాజాగా ఎంగేజ్మెంట్ జ‌ర‌గ‌టంతో ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దాంతో చాలామంది ఈ జంటను దీవిస్తుంటే కొందరు మాత్రం వీరిని ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం యాదమ్మ రాజు హిందువు…కాగా స్టెల్లా క్రిస్టియన్… అయితే హిందూ అయి ఉండి క్రిస్టియన్ ను పెళ్లి చేసుకుంటావా..సిగ్గులేదా అంటూ యాదమ్మ రాజు పై కొంతమంది నెగటివ్ కామెంట్లు పెడుతున్నారు.

Visitors Are Also Reading