Home » “అత‌డు” సినిమాలోని ఈ మిస్టేక్ ను గ‌మనించారా..? ఆడియ‌న్స్ ని గురూజీ మోసం చేశాడంటూ ట్రోల్స్..!

“అత‌డు” సినిమాలోని ఈ మిస్టేక్ ను గ‌మనించారా..? ఆడియ‌న్స్ ని గురూజీ మోసం చేశాడంటూ ట్రోల్స్..!

by AJAY

కేరాఫ్ కంచ‌ర‌పాలెం సినిమాతో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ద‌ర్శ‌కుడు వెంక‌టేష్ మ‌హా. మొదటి సినిమాతోనే ఈ డైరెక్ట‌ర్ ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ సినిమా త‌ర‌వాత ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధించింది. అంతే కాకుండా అంటే సుంద‌రానికి సినిమాతో పాటూ మ‌రికొన్ని సినిమాల‌లో న‌టించాడు కూడా.

ALSO READ : ఆస్కార్ అవార్డు దేనితో తయారు చేస్తారు ? ఆ షీల్డ్ ఖరీదు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

 

అయితే రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో వెంక‌టేష్ మ‌హా చేసిన కామెంట్ లు దుమారం రేపుతున్నాయి. పాన్ ఇండియా లెవ‌ల్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన కేజీఎఫ్ సినిమా పై వెంక‌టేష్ మ‌హా వివాదాస్ప‌ద కామెంట్ లు చేశాడు. దాంతో ఆ సినిమా అభిమానులు వెంక‌టేష్ మ‌హా పై ఫైర్ అయ్యారు. కాగా వెంక‌టేష్ మ‌హా కేజీఎఫ్ సినిమాలో లాజిక్ ను వెతికిన‌ట్టు మీమ‌ర్స్ మిగితా తెలుగు సినిమాల‌లో లాజిక్ లు వెతుకుతూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

తాజాగా అత‌డు సినిమా పై అంలాటి మీమ్స్ వైర‌ల్ అవుతున్నాయి. అత‌డు సినిమాలో హీరోగా న‌టించిన మ‌హేశ్ బాబు ట్రైన్ లో వెళుతుండ‌గా చాలా ఏళ్ల త‌ర‌వాత కుటుంబాన్ని క‌ల‌వ‌డానికి వెళుతున్న పార్దు బులెట్ త‌గిలి చ‌నిపోతాడు. కానీ ఆ బులెట్ ను కాల్చింది మ‌హేశ్ బాబు కోసం. అయితే మహేశ్ బాబు పార్దు ఇంటికి వెళ్లిన త‌ర‌వాత వాళ్లంతా పార్దు అత‌డేన‌ని అనుకోవ‌డంతో సైలెంట్ గా ఉండిపోతాడు.

ALSO READ :చైనాలో పురుగుల వర్షం… ఏదైనా డ్రాగన్ సిటీకి సాధ్యం!

ఆ త‌ర‌వాత పార్దులానే జీవిస్తాడు. కానీ చివ‌రికి నిజం తెలిసిన త‌ర‌వాత అబ‌ద్దం మాత్ర‌మే చెప్పాన‌ని మోసం చేయ‌లేద‌ని చెబుతాడు. కాగా పార్దు చ‌నిపోయింది నీ వ‌ల్లే మోసం చేశావు నువ్వు..? పూరి వాళ్ల అక్క‌కు వైఎస్ఆర్ కానుక‌లా డ‌బ్బులు ఇచ్చి పూరీని వ‌ల‌లో వేసుకున్నావు..నువ్వే పార్దు అని చెప్పి మోసం చేశావ్..అంటూ లాజిక్ వెతికి మ‌రీ మీమర్స్ ట్రోల్ చేస్తున్నారు.

ALSO READ :ముగ్గురు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆ దర్శకుడు ఎలా చనిపోయాడో తెలుసా ?

Visitors Are Also Reading