Home » త్రివిక్రమ్ రాబోయే సినిమాలో పూజా హెగ్డే ను పక్కన పెట్టడానికి కారణం ఇదేనా..?

త్రివిక్రమ్ రాబోయే సినిమాలో పూజా హెగ్డే ను పక్కన పెట్టడానికి కారణం ఇదేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా పేరుపొందిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన దర్శకత్వంలో ఇప్పటికే రెండు సినిమాలు చేసి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది బుట్ట బొమ్మ. తాజాగా బుట్ట బొమ్మ పూజా హెగ్డేను త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ సినిమాలో తీసుకోవడం లేదని తెలుస్తోంది. అల వైకుంఠ పురం సినిమా లో అల్లు అర్జున్ మరియు పూజా హెగ్డే కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత నుండి త్రివిక్రమ్ నుంచి సినిమాలు మాత్రం రాలేదు. దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ నటించిన టువంటి భీమ్లానాయక్ మూవీకి లాక్ కావడమే.

Advertisement

దీనికి ముందుగా ఎన్టీఆర్ 30 సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయడం, కానీ ఆ ప్రాజెక్టు ఆగిపోవడం వలన ఆయన నుంచి సినిమా రాలేదు. అయితే తాజాగా తన నెక్స్ట్ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో వస్తుందని తెలుస్తోంది. దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఈ ప్రాజెక్టు రాబోతోంది. గతంలో త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. కానీ ఈ రెండు సినిమాలు అనుకున్నంత హిట్ ఇవ్వలేదు కానీ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. అయితే మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మూవీలో కథానాయికగా ముందు పూజా హెగ్డే ను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

Advertisement

కానీ తాజాగా ఇందులో ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ ను చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నారట. ఈ అమ్మడు తమిళంలో వరుసగా మూవీస్ చేస్తూ చాలా బిజీగా ఉంది. ఇప్పటికే తెలుగులో శర్వానంద్, నాని సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సాధించింది. దీంతో త్రివిక్రమ్ కన్ను ఈ అమ్మడి పై పడిందట. అలాగే మహేష్ బాబు సరసన ఫ్రెష్ గా కూడా ఉంటుందని భావిస్తున్నారట. ఇది నిజమైతే మాత్రం పూజా హెగ్డే కు హ్యాండ్ ఇచ్చినట్టు అవుతుంది.

also read;

జై చిరంజీవ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..లేటెస్ట్ 10 ఫోటోలు చూస్తే కళ్ళు తిప్పుకోలేరు..?

ఫ్లాప్స్ లో ఉన్న దర్శకులకి ఎన్టీఆర్ ఇచ్చిన 5 సూపర్ హిట్ సినిమాలు ఇవేనా..?

 

Visitors Are Also Reading