Home » అతడో ట్రాన్స్ కో AE.. పెళ్ళంటూ యువతిని నమ్మించి మత్తుమందు ఇచ్చి చివరికి..!

అతడో ట్రాన్స్ కో AE.. పెళ్ళంటూ యువతిని నమ్మించి మత్తుమందు ఇచ్చి చివరికి..!

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ad

బాధ్యత గల జాబ్ లో ఉన్నాడు..పదిమందికి హెల్ప్ చేయాల్సిన ఆ ఉద్యోగి కన్ను ఆ యువతిపై పడింది. నీతోనే పెళ్ళంటూ నమ్మించాడు. చివరికి కరీంనగర్ లోని ఒక గదికి తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి ఆమెపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చివరికి విషయం బయటకు వచ్చి సమస్యల పాలయ్యాడు.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. ట్రాన్స్ కో అసిస్టెంట్ ఇంజనీర్ గా (AE) పనిచేస్తున్న దయాకర్ ఒక అమ్మాయిని కరీంనగర్ లోని తన గదికి తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె గర్భం దాల్చడంతో సోమాజిగూడ తీసుకెళ్లాడు. అక్కడ గైనకాలజిస్ట్ దగ్గర పరీక్షలు చేయించి టాబ్లెట్లు ఇప్పించాడు..

తన కోరిక తీర్చుకున్నాక ఇక నీతో పెళ్లి జరగదు అంటూ ప్లేట్ ఫిరాయించాడు. చివరికి బాధితురాలు చేసేదేమి లేక ఆదివారం మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది.బాధితురాలు వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం శ్రీలంక కాలనీకి చెందిన దయాకర్ జాదవ్ ట్రాన్స్ కో ఏఈ.. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల అదిలాబాద్ కు చెందిన బీటెక్ చదివిన యువతితో నిశ్చితార్థం జరిగింది. రాబోయే భార్యాభర్తలమేగా అంటూ దయాకర్ సదరు యువతితో మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగబరుచు కున్నాడు.

Advertisement

Advertisement

also read:సమంత నటించిన యశోధ సినిమాకు ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా ?

ఈ సందర్భంలోనే తనకు రెండు కోట్ల కట్నం ఇచ్చే సంబంధం వచ్చిందంటూ ఆ అమ్మాయిని దూరం పెట్టేసాడు. దీంతో అమ్మాయి బంధువులు కారణం ఏంటో తెలుసుకునేందుకు అతనితో ఫోన్ ద్వారా,సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడే ప్రయత్నం చేయగా అన్ని నెంబర్లను బ్లాక్ చేసి పెట్టేసాడు. దీంతో సదరు బాధితురాలు వాపోయింది. మోసం చేశాడని భావించి నిందితుడైన దయాకర్ జాదవ్ తో పాటు అతని తల్లి లక్ష్మీ, సోదరి లత, సోదరుడు విలాకర్, వంటి వారిపై ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించింది.

also read:

Visitors Are Also Reading