కల్యాణ్ రామ్ హీరోగా రీసెంట్ గా విడుదలైన బింబిసార సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బింబిసారుడి చరిత్రతో ఈ సినిమాను ట్రైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహించారు. కల్యాణ్ రామ్ కు 2015లో పటాస్ సినిమాతో హిట్ పడింది. ఆ తరవాత మళ్లీ బింబిసార సినిమాతోనే హిట్ వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు పోస్టర్ లను చూసి బాహుబలి, మగధీర సినిమాలతో పోలుస్తూ ట్రోల్ చేశారు.
Advertisement
కానీ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అందరి నోర్లను మూయించినట్టయ్యింది. ఈ చిత్రానికి కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అవ్వడంతో ప్రస్తుతం ఈ సినిమా లాభాలతో నడుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాను ఏకంగా నలుగురు హీరోలు మిస్ చేసుకున్నారట.
Advertisement
ఆ అన్ లక్కీ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం…..బింబిసార కథను దర్శకుడు వశిష్ఠ మొదటగా హీరో నితిన్ కు చెప్పాడట. కానీ నితిన్ కథ విని సినిమాను రిజెక్ట్ చేశాడట. ఆ తరవాత దర్శకుడు ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనికి వివరించాడట. రామ్ కూత ఈ కథ తనకు సెట్ అవ్వదని చెప్పి రిజెక్ట్ చేశాడట. అంతే కాకుండా వశిష్ఠ ఈ సినిమా కథను రాజ్ తరుణ్ కు సైతం వివరించాడు.
రాజ్ తరుణ్ కూడా కథ విని రిజెక్ట్ చేశాడు. మరోవైపు హీరో రవితేజ కు కూడా ఈ కథ చెప్పానని వశిష్ఠ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కానీ రవితేజ ఈ సినిమాను సున్నితంగా తిరస్కరించాడు. ఇలా చర్చలు జరుపుతున్న క్రమంలో బింబిసార సినిమా కథకు కల్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఐదు హీరోలు రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక పెద్దలు మాట్లాడుకునేట్టు ముందుగా ఎవరికి ఏది రాసిపెట్టి ఉంటుందో అదే జరుగుతుంది అన్నట్టుగా ఈ సినిమా కల్యాణ్ రామ్ కోసమే రాసి పెట్టి ఉందేమో.