Home » ప్రేమ పెళ్లిళ్లు చేసుకొని విడిపోయిన జంటలు ఇవే..!

ప్రేమ పెళ్లిళ్లు చేసుకొని విడిపోయిన జంటలు ఇవే..!

by Azhar
Ad

ప్రేమ పెళ్లిళ్లు అనేవి ఈరోజుల్లో సర్వ సాధారణం. అదే విధంగా విడాకులు ప్రస్తుతం మాములు విషయం గా మారిపోయింది. ఈ మధ్య కాలంలో అయితే మన దేశంలో విపరీతంగా విడాకులు జరుగుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో కూడా ఇది మాములే. అయితే అలా ప్రేమ పెళ్లి చేసుకొని విడిపోయిన సినీ నటులు ఎవరో చూద్దాం..!

Advertisement

హీరో చలం, నటి శారదా అప్పుడు 1972లోనే ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కానీ తర్వాత మనస్పర్థలు కారణంగా 1984లో విడాకులు తీసుకున్నారు. టాలీవుడ్ లో మంచి నటులుగా గుర్తింపు తెచుకున్న శరత్ బాబు, రమాప్రభ 1974లో ప్రేమ పెళ్లి చేసుకొని.. మనస్పర్థలు వల్ల 1988లో విడిపోయారు. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత హీరో కమల్ హాసన్ హీరోయిన్ సారికను ప్రేమించి 1988లోనే రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ 2004లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ కూడా 1994లో తమిళ నటి లలిత కుమారిని ప్రేమ వివాహం చేసుకొని 2009లో విడాకులు తీసుకున్నాడు.

Advertisement

అదే విధంగా 2003 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సిద్దార్థ్- మేఘన 2007 లో విడిపోయారు. ఇక అక్కినేని నాగార్జునకు రామానాయుడు కూతురు లక్ష్మీతో 1984లో పెళ్లి జరగగా… 1990 లో విడాకులు జరిగాయి. అదే అక్కినేని కుటుంబానికి చెందిన సుమంత 2004లో హీరోయిన్ కీర్తి రెడ్డితో ని ప్రేమ పెళ్లి చేసుకొని 2006లో విడాకులు తీసుకున్నాడు. పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్ కూడా రేణూ దేశాయ్‌ని 2009 ప్రేమించి పెళ్లి చేసుకొని.. 2012 లో విడిపోయారు. యాంకర్ , నటి అయిన ఝాన్సీ, నటుడు జోగినాయుడు ప్రేమ పెళ్లి చేసుకొని… తర్వాత గొడవలతో విడిపోయారు. ఇక ఇప్పుడు అందరికి తెలిసిన నాగచైతన్య, సమంత కూడా దాదాపు ఆరేళ్ళు ప్రేమించుకొని 2017 లో పెళ్లితో ఒక్కటై… 2021 లో విడాకులతో రెండయ్యారు.

ఇవి కూడా చదవండి :

ధోనిని విషయంలో అన్ని జట్లకు అక్తర్ వార్నింగ్..!

కెప్టెన్సీని కష్టాలో పడేసుకున్న శ్రేయాస్ అయ్యర్…!

Visitors Are Also Reading