సినిమా ఇండస్ట్రీలో రానించాలంటే అంత ఈజీ విషయం కాదు. మొదట అవకాశాలు రావడమే చాలా కష్టం.. అవకాశాలు వచ్చినా హిట్ పడుతుందని గ్యారెంటీ లేదు. ఇక సినిమాలు తప్ప మరొకటి తెలియని వారు సినిమాలను అమితంగా ప్రేమించేవాళ్లు ఎంతకష్టమైనా ఒక్కఛాన్స్ అంటూ ఇండస్ట్రీలోనే ఉంటారు. ఇక మరికొందరు ఆర్థికంగా బలహీనంగా ఉన్నా సినిమాలపై ఉన్న ప్రేమతో ఇండస్ట్రీలోకి వస్తుంటారు.
అక్కడ నిలబడలేక బలవన్మరణానికి పాల్పడే వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. ఇక తాజాగా పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. పూరీ జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తున్న సాయికుమార్ అనే వ్యక్తి ఈరోజు హైదరాబాద్ లోని దుర్గం చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిర్వహించి సాయి కుమార్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పూరీ వద్ద సాయి కిరణ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.