ప్రేమించడం వారినే పెళ్లి చేసుకోవాలనుకోవడం కామన్. కానీ ఓ యువతి అప్పటికే పెళ్లై పిల్లలు ఉన్న వ్యక్తితో ప్రేమలో పడింది. అతడికి పెళ్లైందని తెలిసినా అతడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అంతే కాకుండా అతడితో ఇంటినుండి పారిపోయింది. ఆ తరవాత వారి స్టోరీలో చాలా ట్విస్ట్ లు నెలకొన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..ఈ ఘటన తిరుపతి జిల్లాలోని శ్రీకాలహస్తి ఎన్టీఆర్ నగర్ లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రిత అనే యువతికి తన అమ్మమ్మగారి ఊరు రామచంద్రాపురానికి చెందిన చంద్రశేఖర్ తో పరిచయం ఏర్పడింది.
చంద్రశేఖర్ వాలంటీర్ గా ఉద్యోగం చేస్తుండగా అప్పటికే పెళ్లై ఓ బాబు కూడా ఉన్నాడు. అయినప్పటికీ చంద్రశేఖర్ చంద్రికతో ప్రేమాయణం నడిపించాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఇంటినుండి పారిపోయారు. దాంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వెతికిపట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి ఇంటికి పంపించారు. ఆ తరవాత చంద్రితకు కుటుంబ సభ్యులు మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేశారు. దాంతో చంద్రిత ప్రియుడిని విడిచి ఉండలేకపోయింది. మరోసారి చంద్రశేఖర్ తో కలిసి ఇంటినుండి పారిపోయింది. ఆ కొద్దిరోజులకే ఇద్దరూ కాల్వలో పడి మరణించారంటూ ప్రచారం జరిగింది.
గుర్తుతెలియని మృతదేహాలను చంద్రిత, చంద్రశేఖర్ అనుకుపి పోలీసులు భావించారు. ఈ ఘటన పై కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినా వాళ్లు మృతదేహాల వద్దకు వచ్చి చూడలేదు. కానీ ఇద్దరూ చనిపోయారని కుటుంబ సభ్యులు గ్రామస్థులు భావించారు. ఈ ఘటన జరిగి నెలలు గుడుస్తుంటే ఇప్పుడు మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చంద్రశేఖర్ తో కలిసి చంద్రిత సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో తాము క్షేమంగా ఉన్నామని తప్పుడు ప్రచారం చేయవద్దని అన్నారు. ప్రస్తుతం సంతోషంగా ఉన్నామని గ్రామానికి అప్పుడే రాలేమని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.